Extramarital Affair: ఛీ ఛీ.. నువ్వు తల్లివేనా.. వివాహేతర సంబంధం కోసం కన్న కొడుకునే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Killed Her Son For Extramarital Affair In Kurnool: తల్లిని దేవుడి ప్రతిరూపంగా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే.. తొమ్మిది నెలలు మోసి, ఆపై తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆలనాపాలనా చూసుకుంటుంది తల్లి. తాను పస్తులుండి, పిల్లల కడుపు నింపుతుంది. అసలు తల్లి ప్రేమని మాటల్లో వర్ణించలేం. కానీ.. ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా పైశాచికంగా ప్రదర్శించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తన ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురి చేసింది. అతడు చచ్చేదాకా వేధింపులకు గురి చేసింది. అవును.. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన నందలూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Off The Record: ఆ జిల్లాలో పొలిటికల్ వారసుల హడావిడి.. నాన్నకు ప్రేమతో..!
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
నందలూరు మండలంలోని అరవపల్లెకు చెందిన జహీరున్నీషాకు కొన్ని సంవత్సరాలక్రితం అబ్దుల్లాతో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని మదరసాలో చేర్పించగా.. మూడో పిల్లాడు షాహిద్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే.. షాహిద్ మూగవాడు. కొంతకాలం క్రితం విభేదాల కారణంగా.. జహీరున్నిషా, అబ్దుల్లా విడిపోయాడు. దీంతో.. షాహిద్ని కూడా తన వద్దే ఉంచుకుంది. బాబుతో ఒంటరిగా ఉంటున్న జహీరున్నీషాకు కొన్నాళ్ల క్రితం స్వీపర్గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ పరిచయం అయ్యాడు. అది వారిద్దరిని దగ్గర చేయడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే.. నారాయణతో కలిసి ఉంటున్నప్పటి నుంచి జహీరున్నీషా షాహిద్ని కొట్టడం మొదలుపెట్టింది.
Anurag Thakur: భారతీయ సంస్కృతి, సమాజాన్ని కించపరిచే ఓటీటీ ప్లాట్ఫారమ్లను అనుమతించబోం
తన సహజీవనానికి అడ్డుగా ఉంటున్నాడని షాహిద్ని చిత్రహింసలకు గురి చేసేది. గత నెల 28న ఆమె తీవ్రంగా కొట్టడంతో.. పాపం అతడు మంచాన పడ్డాడు. మూగవాడు కూడా కావడంతో, తన బాధ ఎవరితో చెప్పుకోలేక షాహిద్ లోలోపలే కుమిలిపోయాడు. స్థానికులు పిల్లాడి పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు కౌన్సిలింగ్ ఇచ్చి, బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని హితబోధ చేసి పంపించారు. అయినా జహీరున్నీషాలో మార్పు రాలేదు. నాలుగు రోజుల క్రితం తలుపులు మూసేసి.. తన ప్రియుడితో కలిసి ఆమె షాహిద్ని చితకబాదింది. పాపం ఆ కుర్రాడు.. వాళ్లు కొట్టిన దెబ్బల్ని భరించలేక బోరున విలపించాడు. ఎంత ఘోరంగా కొట్టారంటే.. వారి దెబ్బలకు అతడు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు.
Girlfriend Killed: యూపీలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు
పిల్లాడు చనిపోతే తమకు సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో.. వాళ్లు కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడ్ని పరిశీలించిన వైద్యులు.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ.. మెట్లపై నుంచి పడి షాహిద్ గాయాలపాలయ్యాడని జహీరున్నీషా మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నించింది. చివరికి ఆ పిల్లాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!