Undavalli Sridevi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ విజయం సాధించింది.. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి అనురాధ విక్టరీ కొట్టారు.. దీంతో, వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు అనేది స్పష్టమైపోయింది.. ఈ నేపథ్యంలో.. కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా ఈ కోవలోనే హల్ చల్ చేస్తోంది.. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఉండవల్లి శ్రీదేవి.. రహస్య ఓటింగ్లో నా పేరు ఎలా చెబుతారు..? అని నిలదీశారు.. ఈరోజు ఉదయమే మా అమ్మాయితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశానంటూ ఓ ఫొటోలను విడుదల చేసిన ఆమె.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకిచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని స్పష్టం చేశారు.. కానీ, నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. దళిత మహిళను కాబట్టే నేనంటే చులకన చేసి మాట్లాడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
Read Also: Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్
కాగా, మా ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.. మాకు 7 సీట్లు రాకపోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఎవరినో ప్రలోభపెట్టారని అర్థమవుతోందన్న ఆయన.. ప్రలోభాలకు గురైన వాళ్లను వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. తెరవెనుక డబ్బులు పని చేశాయని అనుకోవాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. క్రాస్ ఓటింగ్ జరగకుండా మానవ ప్రయత్నం చేశాం.. అయినా జరిగింది.. ఇక, క్రాస్ ఓటింగ్పై పార్టీ అంతర్గతంగా చర్చిస్తుందన్నారు. ఏదేమైనా.. ప్రలోభపెట్టి గెలవడాన్ని సక్సెస్ అనుకోకూడదు.. ప్రలోభపెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అంటూ మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.