Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. తాజాగా ఎమ్మెల్యే కోటాలోనూ గెలుపు రాజకీయంగా ఆసక్తి రేపింది. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని ఆపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికార వైసీపీ మాత్రం టీడీపీకి అంత సీన్ లేదని చెబుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ.. ఓ స్థానాన్ని కోల్పోవడంతో ఆపార్టీకి నిరాశలో ఉంది. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగురు అభ్యర్థుల్ని పోటీలో పెట్టామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానంలో గెలిచిందని ఆరోపించారు. డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు.
Also Read: MLA Quota MLC Elections Results: సంబరాల్లో టీడీపీ శ్రేణులు.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు..!
గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారని సజ్జల చెప్పారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ సవాల్ విసిరారు. క్రాస్ ఓటింగ్ పాల్పడ్డవారిని గుర్తించామన్నారు. సరైన సమయంలో చర్యలుంటాయని సజ్జల స్పష్టం చేశారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
Also Read:Samantha: బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో
కాగా,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు.చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా ఓటు వేసిన ఆనలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు టీడీపీకి పడినట్లు తెలుస్తోంది. అయితే, మిగత రెండు ఓట్లు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ఖండించారు.
- Tags
- MLC ELECTIONS
- Sajjala
- tdp
- YSRCP
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!