Botsa Satyanarayana: ఈనెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ వికేంద్రీకరణ రాగం అందుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వరకు భారీ ప్రదర్శన ఉంటుందని బొత్స వెల్లడించారు. వికేంద్రీకరణపై మన ఆవేశాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముసుగులో గుద్దులాట అవసరం లేదని.. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ ఉందని తేలిపోయిందన్నారు. మన ఆకాంక్షలు చెప్పాల్సింది మనమేనని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Read Also: Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి.. బీజేపీకి ఓటెయ్యండి
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
అటు తనకు బుర్ర లేదన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడికి బుర్ర ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కంటే బరువు, పొడవు ఎక్కువ ఉన్నంత మాత్రాన అచ్చెన్నాయుడు జ్ఞాని అయిపోతారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు, వాళ్ల వారసులకు ఉత్తరాంధ్రలో ఆస్తులు, పదవులు కావాలి కానీ అభివృద్ధి వద్దా అని నిలదీశారు. అచ్చెన్నాయుడు భాష సంభాళించుకోవాలని.. టీడీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని మంత్రి బొత్స హితవు పలికారు. విశాఖను రాజధానిని చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటన్నారు. ఈనెల 15న జరిగే విశాఖ గర్జనను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 12న అన్ని వార్డుల్లో మానవహారాలు ఏర్పాటు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!