GO Number 1: జీవో నంబర్ 1ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ఇలా స్పందించిన మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GO Number 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ నెల 23వ తేదీ వరకు జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జీవో నంబర్ 1ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, జీవో నంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. దీనిపై ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, జీవో నంబర్ వన్ను హైకోర్టు సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున.
Read Also: Jana Sena Yuvashakthi Public Meeting Live: జనసేన యువశక్తి భారీ బహిరంగ సభ లైవ్ అప్ డేట్స్
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సులో సాగుతున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులను పరిశీలించిన మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్.. జీవో నెంబర్-1 సస్పెండ్ చేసిన అంశంపై స్పందించారు.. జీవో నెంబర్-1 పేదల ప్రాణాలను కాపాడేందుకు తెచ్చిందన్నారు.. పేదలను చంద్రబాబు బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని.. జీవో నెంబర్-1కు మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలి అని సూచించారు. పేదల కోసం జీవితంలో ఒకసారైనా చంద్రబాబు ఆలోచన చేశారా అని ప్రశ్నించారు మంత్రి మేరుగు నాగార్జున.
Read Also: Nalgonda Land Issue: భూవివాదం.. ట్రాక్టర్తో తొక్కించే యత్నం.. వీడియో వైరల్
ఇక, జీవో నెంబర్-1ని రాజకీయ కోణంలో చూడకూడదని హితవుపలికారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టే వారి కోసం జీవో తెచ్చామన్నారు. చంద్రబాబు పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నాడని ఫైర్ అయ్యారు.. తన సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది ప్రాణాలు తీశారని విమర్శించారు. మరోవైపు.. అడగకుండానే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ప్రశంసలు కురిపించారు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున.. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదని.. అనుకున్న సమయానికి అంబేద్కర్ విగ్రహం పూర్తి చేయాలని సీఎం పనులు చేయిస్తున్నారని తెలిపారు. విగ్రహం కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. విగ్రహం భాగాలన్నీ విడివిడిగా చేరుకుంటున్నాయని.. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తామని వెల్లడించారు..
తాజావార్తలు
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి