Vidadala Rajini: ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారని.. అయినా చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు త్వరలో మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.
Read Also: Three Wheels Electric Car: మూడు చక్రాలతో ఎలక్ట్రిక్ కారు.. ధర రూ.4 లక్షలే..!!
Also Read
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయని మంత్రి విడదల రజినీ అన్నారు. ఈ ఐదు మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు. మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదని విడదల రజినీ ఎద్దేవా చేశారు. తమకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. తల్లి లాంటి భారతిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని.. తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తామని మంత్రి విడదల రజినీ హెచ్చరించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..