Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venu Gopala Krishna Released Dhavaleswaram Barrage Water: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అని మాట్లాడిందని.. కానీ సీఎం జగన్ మాత్రం పంట వేసే రైతుకి భరోసా ఇస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. ధవళేశ్వరం వద్ద గోదావరి బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్కు ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని దైవంగా భావించి, ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నల కోసం ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. మూడు డెల్టాల ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఖరీఫ్కు గోదావరి జలాల విడుదలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రజారాజ్యం కోసం మెడికల్ కాలేజీ విషయంలో 150 సీట్లు జీవో విడుదల అయ్యిందన్నారు. ఒక కోటి 20 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ కేటాయించుంది ఒక్క వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. పి.గన్నవరంలో బ్రిడ్జి కడుతున్నారని, పలు చోట్ల పనులు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని నవెల్లడించారు.
Telangana : పెద్దపల్లిలో ఘోరం.. ఆటో బైక్ ఢీ.. లారీ కింద పడి వ్యక్తి మృతి..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
ఇదే సమయంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈరోజు రైతు భరోసాతో పాటు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి రైతులకు నీటిని విడుదల చేశామని చెప్పారు. 8 వేల క్యూసెక్కుల నీటిని మూడు డెల్టాలకు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెడికల్ కాలేజీకి 150 సీట్లు కేటాయించడంపై సీఎం జగన్కి ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రైతుల పక్షాన అండగా నిలిచారన్నారు. కాగా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ట, తానేటి వనితలతో పాటు ఎంపీ మార్గాని భరత్, కలెక్టరు మాధవీలత, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు.
Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!