Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venu Gopala Krishna Released Dhavaleswaram Barrage Water: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అని మాట్లాడిందని.. కానీ సీఎం జగన్ మాత్రం పంట వేసే రైతుకి భరోసా ఇస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. ధవళేశ్వరం వద్ద గోదావరి బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్కు ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని దైవంగా భావించి, ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నల కోసం ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. మూడు డెల్టాల ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఖరీఫ్కు గోదావరి జలాల విడుదలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రజారాజ్యం కోసం మెడికల్ కాలేజీ విషయంలో 150 సీట్లు జీవో విడుదల అయ్యిందన్నారు. ఒక కోటి 20 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ కేటాయించుంది ఒక్క వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. పి.గన్నవరంలో బ్రిడ్జి కడుతున్నారని, పలు చోట్ల పనులు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని నవెల్లడించారు.
Telangana : పెద్దపల్లిలో ఘోరం.. ఆటో బైక్ ఢీ.. లారీ కింద పడి వ్యక్తి మృతి..
Also Read
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
ఇదే సమయంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈరోజు రైతు భరోసాతో పాటు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి రైతులకు నీటిని విడుదల చేశామని చెప్పారు. 8 వేల క్యూసెక్కుల నీటిని మూడు డెల్టాలకు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెడికల్ కాలేజీకి 150 సీట్లు కేటాయించడంపై సీఎం జగన్కి ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రైతుల పక్షాన అండగా నిలిచారన్నారు. కాగా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ట, తానేటి వనితలతో పాటు ఎంపీ మార్గాని భరత్, కలెక్టరు మాధవీలత, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు.
Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?