Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venu Gopala Krishna Released Dhavaleswaram Barrage Water: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అని మాట్లాడిందని.. కానీ సీఎం జగన్ మాత్రం పంట వేసే రైతుకి భరోసా ఇస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. ధవళేశ్వరం వద్ద గోదావరి బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్కు ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని దైవంగా భావించి, ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నల కోసం ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. మూడు డెల్టాల ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఖరీఫ్కు గోదావరి జలాల విడుదలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రజారాజ్యం కోసం మెడికల్ కాలేజీ విషయంలో 150 సీట్లు జీవో విడుదల అయ్యిందన్నారు. ఒక కోటి 20 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ కేటాయించుంది ఒక్క వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. పి.గన్నవరంలో బ్రిడ్జి కడుతున్నారని, పలు చోట్ల పనులు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని నవెల్లడించారు.
Telangana : పెద్దపల్లిలో ఘోరం.. ఆటో బైక్ ఢీ.. లారీ కింద పడి వ్యక్తి మృతి..
Also Read
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
ఇదే సమయంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈరోజు రైతు భరోసాతో పాటు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి రైతులకు నీటిని విడుదల చేశామని చెప్పారు. 8 వేల క్యూసెక్కుల నీటిని మూడు డెల్టాలకు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెడికల్ కాలేజీకి 150 సీట్లు కేటాయించడంపై సీఎం జగన్కి ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రైతుల పక్షాన అండగా నిలిచారన్నారు. కాగా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ట, తానేటి వనితలతో పాటు ఎంపీ మార్గాని భరత్, కలెక్టరు మాధవీలత, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు.
Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!