Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
Minister Venu Gopala Krishna Released Dhavaleswaram Barrage Water: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అని మాట్లాడిందని.. కానీ సీఎం జగన్ మాత్రం పంట వేసే రైతుకి భరోసా ఇస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. ధవళేశ్వరం వద్ద గోదావరి బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్కు ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని దైవంగా భావించి, ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నల కోసం ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. మూడు డెల్టాల ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఖరీఫ్కు గోదావరి జలాల విడుదలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రజారాజ్యం కోసం మెడికల్ కాలేజీ విషయంలో 150 సీట్లు జీవో విడుదల అయ్యిందన్నారు. ఒక కోటి 20 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ కేటాయించుంది ఒక్క వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. పి.గన్నవరంలో బ్రిడ్జి కడుతున్నారని, పలు చోట్ల పనులు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని నవెల్లడించారు.
Telangana : పెద్దపల్లిలో ఘోరం.. ఆటో బైక్ ఢీ.. లారీ కింద పడి వ్యక్తి మృతి..
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ఇదే సమయంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈరోజు రైతు భరోసాతో పాటు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి రైతులకు నీటిని విడుదల చేశామని చెప్పారు. 8 వేల క్యూసెక్కుల నీటిని మూడు డెల్టాలకు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెడికల్ కాలేజీకి 150 సీట్లు కేటాయించడంపై సీఎం జగన్కి ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రైతుల పక్షాన అండగా నిలిచారన్నారు. కాగా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ట, తానేటి వనితలతో పాటు ఎంపీ మార్గాని భరత్, కలెక్టరు మాధవీలత, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు.
Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!