Roja Selvamani: ఎడ్లబండిని తోలిన మంత్రి రోజా.. ఫోటోలు వైరల్
Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు బావితరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహించడం చాలా అభినందనీయమని మంత్రి రోజా కొనియాడారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆమె విమర్శలు చేశారు.
Read Also: Chintamaneni Prabhakar: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై చింతమనేని సంచలన వ్యాఖ్యలు
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
నరకాసురుడిని సంహరించినందుకు దసరా శరన్నవరాత్రులు జరుపు కుంటామని.. మూడేళ్ల క్రితం జగనన్న మన రాష్ట్రంలో నారాసురిడిని సీఎం జగన్ సంహరించారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుప్పం వెళ్తే లోకేష్ కలుగులో ఎలుకలా దాక్కున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు లాంటి సైకోలను జనం రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రోజా అన్నారు. అటు రాష్ట్రానికి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలందరూ విజయదశమి రోజు ఆలయాలకు వెళ్లి పూజలు చేయాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతటా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ యోచిస్తుంటే.. తన బినామీలను కాపాడుకోవడానికే 29 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరీ వెంకట నాగేశ్వరరావు గారు నిర్వహించడం చాలా అభినందనీయం. pic.twitter.com/r1X5ze2tCV
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2022
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?