Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Praises CM YS Jagan Over Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎమ్ఓయూలు జరిగాయని తెలిపారు. పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు. వంద శాతం ప్రతిపాదనలన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పారు. జగన్ అంటే ఒక బ్రాండ్ అని, జగన్ అంటే ఓ జోష్ అని రోజా కొనియాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతోనే.. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని మంత్రి వెల్లడించారు.
China: అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అంతకుముందు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రోజా అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా నామమాత్ర ఒప్పందాలు కాదని, అన్ని ఒప్పందాలను క్షేత్రస్థాయిలో పెట్టుబడుల వరకు తీసుకువెళ్తామని అన్నారు. కొవిడ్ కారణంగా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని.. విశాఖలో సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్వైపు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబురాయి హోటల్స్ యాజమాన్యం తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో సరికొత్త హోటల్స్ ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంగా, విశాఖపట్నం ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.
Husband Kidnap: దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
అలాగే.. ట్విటర్ మాధ్యమంగా ఏపీ రాజధానిపై కూడా రోజా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ను తీర్చిదిద్దుతాం – నిజమైన ఆంధ్రోడు’’ అంటూ ట్వీట్ చేశారు. అసలైన ఆంధ్రావాళ్లు ఎవరైనా.. రాష్ట్ర పురోగతిని కాంక్షించే వాళ్లు ఎవరైనా సరే.. విశాఖను రాజధానిగా అంగీకరిస్తా్రనే అర్థం వచ్చే రోజా ఆ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!