Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Praises CM YS Jagan Over Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎమ్ఓయూలు జరిగాయని తెలిపారు. పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు. వంద శాతం ప్రతిపాదనలన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పారు. జగన్ అంటే ఒక బ్రాండ్ అని, జగన్ అంటే ఓ జోష్ అని రోజా కొనియాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతోనే.. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని మంత్రి వెల్లడించారు.
China: అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అంతకుముందు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రోజా అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా నామమాత్ర ఒప్పందాలు కాదని, అన్ని ఒప్పందాలను క్షేత్రస్థాయిలో పెట్టుబడుల వరకు తీసుకువెళ్తామని అన్నారు. కొవిడ్ కారణంగా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని.. విశాఖలో సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్వైపు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబురాయి హోటల్స్ యాజమాన్యం తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో సరికొత్త హోటల్స్ ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంగా, విశాఖపట్నం ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.
Husband Kidnap: దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
అలాగే.. ట్విటర్ మాధ్యమంగా ఏపీ రాజధానిపై కూడా రోజా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ను తీర్చిదిద్దుతాం – నిజమైన ఆంధ్రోడు’’ అంటూ ట్వీట్ చేశారు. అసలైన ఆంధ్రావాళ్లు ఎవరైనా.. రాష్ట్ర పురోగతిని కాంక్షించే వాళ్లు ఎవరైనా సరే.. విశాఖను రాజధానిగా అంగీకరిస్తా్రనే అర్థం వచ్చే రోజా ఆ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!