Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Praises CM YS Jagan Over Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎమ్ఓయూలు జరిగాయని తెలిపారు. పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు. వంద శాతం ప్రతిపాదనలన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పారు. జగన్ అంటే ఒక బ్రాండ్ అని, జగన్ అంటే ఓ జోష్ అని రోజా కొనియాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతోనే.. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని మంత్రి వెల్లడించారు.
China: అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!
Also Read
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
అంతకుముందు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రోజా అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా నామమాత్ర ఒప్పందాలు కాదని, అన్ని ఒప్పందాలను క్షేత్రస్థాయిలో పెట్టుబడుల వరకు తీసుకువెళ్తామని అన్నారు. కొవిడ్ కారణంగా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని.. విశాఖలో సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్వైపు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబురాయి హోటల్స్ యాజమాన్యం తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో సరికొత్త హోటల్స్ ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంగా, విశాఖపట్నం ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.
Husband Kidnap: దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
అలాగే.. ట్విటర్ మాధ్యమంగా ఏపీ రాజధానిపై కూడా రోజా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ను తీర్చిదిద్దుతాం – నిజమైన ఆంధ్రోడు’’ అంటూ ట్వీట్ చేశారు. అసలైన ఆంధ్రావాళ్లు ఎవరైనా.. రాష్ట్ర పురోగతిని కాంక్షించే వాళ్లు ఎవరైనా సరే.. విశాఖను రాజధానిగా అంగీకరిస్తా్రనే అర్థం వచ్చే రోజా ఆ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
-
Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?