Husband Kidnap: దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Kidnapped By Wife Lover And Tortured: సాధారణంగా తమ భార్య వైపు ఇతర మగాడు కన్నెత్తి చూస్తేనే భర్తలకు కోపం వస్తుంది. అలాంటిది.. వివాహేతర సంబంధం పెట్టుకుంటే, చూస్తూ ఊరికే ఉంటాడా? తప్పకుండా తనదైన రీతిలో ఇద్దరికి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. మరీ ముఖ్యంగా.. తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తికి తగిన శాస్తి చేస్తాడు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు కోపంతో రగిలిపోయిన అతను, సోషల్ మీడియాలో భార్య ప్రియుడిపై ఓ ప్రచారం చేశాడు. అయితే.. ఆ పోస్టింగ్స్ చూసి మండిపోయిన భార్య ప్రియుడు, ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
తిరుపతిలోని చంద్రగిరికి చెందిన బాధితుడు.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు భర్త కుటుంబ పోషణ కోసం బెంగుళూరులో పని చేస్తుంటే, అతని భార్య మాత్రం అన్వర్ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు.. ప్రియుడ్ని ఆమె ఇంటికి పిలిపించుకునేది. అయితే.. వీరి బాగోతం ఎంతోకాలం దాగి ఉండలేదు. భర్తకు వీరి విషయం తెలిసిపోయింది. మరోసారి అన్వర్తో కలవొద్దని తన భార్యను మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అన్వర్తో వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. అన్వర్పై పగ పెంచుకున్నాడు. ఆ కోపంలోనే సోషల్ మీడియాలో RIP అంటూ అన్వర్పై పోస్టింగ్స్ పెట్టాడు. కనీసం ఆ పోస్టింగ్స్ చూసి అయినా, అన్వర్ తన భార్యకు దూరం అవుతాడని భర్త భావించాడు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
కానీ.. ఆ పోస్టింగ్స్ చూసి రగిలిపోయిన అన్వర్, తన స్నేహితుడు వంశీ చౌదరి సహకారంతో బాధితుడ్ని కిడ్నాప్ చేశాడు. బెంగుళూరులో ఉన్న అతడ్ని, చంద్రగిరికి తీసుకొచ్చాడు. అతని తలపై మూత్రం పోసి, గుండు గీయించి, అత్యంత దారుణంగా చితకబాదాడు. అంతేకాదు.. తానే గుండు గీయించుకున్నానని, ఏం జరిగినా దానికి తానే బాధ్యుడినంటూ భర్తతో వీడియో కూడా తీయించాడు. ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవి వైరల్ అవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి.. నిందితులైన అన్వర్, వంశీలను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!