కొత్త విద్యా విధానానికి ఏపీ కెబినెట్ ఆమోదం : పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త విద్యా విధానాన్ని ఏపీ కెబినెట్ ఆమోదించింది అని మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్త విద్యా విధానం వల్ల స్కూళ్ల మూసివేత ఉండదు.. ఏ ఉపాధ్యాయుడి ఉద్యోగం తీసే ప్రసక్తే ఉండదు. పీపీ-1, పీపీ-2 మొదలుకుని హైస్కూల్ ప్లస్ వరకు పాఠాశాలలు ఉంటాయి. హైస్కూల్ ప్లస్ కేటగిరిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలను కెబినెట్లో తీసుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం అని తెలిపారు. 1-5 తరగతుల విద్యార్ధులకు ఒకటీ లేదా ఇద్దరు టీచర్లతో విద్యా బోధన జరుగుతోంది.
ప్రస్తుతం అమలవుతోన్న విద్యా విధానంపై సర్వే నిర్వహించాం. విద్యా ప్రమాణాలు సరిగా లేవనే విషయం సర్వే ద్వారా వెల్లడైంది. విద్యార్ధుల జీవితాలను మనమే నాశనం చేస్తున్నామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. సర్వే ఫలితాలు చూశాక.. విద్యా విధానం మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాం. బై లింగ్వల్ టెక్స్ట్ పుస్తకాలు అచ్చు వేసిన మొదటి రాష్ట్రం ఏపీనే. తెలుగు సబ్జెక్ట్ తప్పకుండ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువతోన్న సుమారు 4 లక్షలకు పైగా పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా విద్యార్ధులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు అని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
తాజావార్తలు
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!