Peddi Reddy: చంద్రబాబు హయాంలో వర్షాలు పడలేదు.. రోడ్లు పాడు కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని తెలిపారు. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు. 500 హామీలు ఇచ్చి మేనిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
వైసీపీలో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనకు సమాచారం అందిస్తే తక్షణం స్పందిస్తానని సూచించారు. తనపై బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో నేరుగా గడప గడపకు వెళ్లలేకపోయానని తెలిపారు. తన తరపున ఇతర నాయకులు గడప గడపకు తిరుగుతున్నారని.. వైసీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. కులం, మతం, పార్టీ చూడకుండా పేదరికం చూసి వైఎస్ జగన్ పథకాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా వారిని జన్మభూమి కమిటీల్లో వేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆ కమిటీల్లో వారు వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని విమర్శలు చేశారు. ఆసరా కింద రూ.26 వేల కోట్లను నాలుగు విడతల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో 95 శాతం హామీలు అమలు చేసిన వేరే ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు ఆరు జిల్లాలకు రూ.8 వేల కోట్లకు పైగా సీఎం జగన్ మంజూరు చేశారన్నారు. గండికోట నుంచి మనకు నీరు ఇచ్చేందుకు రూ. 2,700 కోట్లతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అక్కడక్కడా రోడ్లు పాడైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!