AUS vs IND: సచిన్ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
- నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్
- ఫామ్లో లేని విరాట్ కోహ్లీ
- టెండూల్కర్తో పాఠాలు చెప్పించాలంటున్న రామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆసీస్ గడ్డకు చేరుకుని సాధన కూడా షురూ చేసింది. గత రెండు పర్యాయాలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సాధించిన భారత్.. హ్యాట్రిక్పై గురి పెట్టింది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పెద్దగా ఫామ్లో లేకపోవడం జట్టుకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్లో ఈ ఇద్దరే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.
రోహిత్ శర్మ అడపాదడపా ఆడుతున్నా.. విరాట్ కోహ్లీ మాత్రం ఇటీవల చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. విరాట్ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చెలరేగిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ బీసీసీఐకి సూచించాడు. ఈ సిరీస్ కోసం కన్సల్టెంట్గా సచిన్ను నియమించుకోవాలన్నాడు. ఈ రోజుల్లో కన్సల్టెంట్ల నియామకం సర్వసాధారణం అని రామన్ పేర్కొన్నాడు.
Also Read
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
Also Read: Rohit Sharma: అందరి తండ్రుల మాదిరిగానే రోహిత్!
‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో ఉంది. టీమిండియాకు ప్రయోజనం చేకూరాలంటే నాదొక సూచన. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సేవలను బీసీసీఐ వినియోగించుకోవాలి. ఆసీస్ టెస్ట్ సిరీస్ కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్గా సచిన్ను నియమించాలి. తొలి టెస్టు, రెండో టెస్టుకు చాలా సమయం ఉంది. ఈ రోజుల్లో కన్సల్టెంట్ల నియామకం సర్వసాధారణం. నేను చెప్పింది ఓసారి బీసీసీఐ ఆలోచన చేయాలి’ అని డబ్ల్యూవీ రామన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియాపై 39 టెస్టులు ఆడిన సచిన్ 3,630 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 20 టెస్టులలో 1,809 రన్స్ బాదాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లీ ఇబ్బందిపడగా.. సచిన్ సలహాలతో రాణించాడు.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?