Vasantha vs Jogi Ramesh: మైలవరం పంచాయతీ.. సజ్జలతో ఆ ఇద్దరి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. ముఖ్యంగా మైలవరంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి జోగి రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. సీఎం కాంప్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో మంత్రి జోగి రమేష్ భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గ వివాదం పై చర్చ జరిగిందని తెలుస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి జోగి రమేష్ వివరణ ఇచ్చారు.
ఇదిలా వుంటే.. నిన్న సజ్జలతో సమావేశం అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ అయి తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్లు, తదితర పరిణామాలను వివరించిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా మంత్రి జోగి రమేష్ పై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీవీతో మాట్లాడిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలు ఆరోపణలు చేశారు. నన్ను పార్టీలో కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతున్నారని, నా పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అధిష్టానానికి కంప్లైంట్ చేశారు.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
Read Also: Asaduddin Owaisi: “మీరు పెళ్లి చేసుకోండి”.. మోదీ సర్కార్ను నమ్మవద్దు.
తాను పార్టీ మారతానని, మరో జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారు. నేను పోటీ అంటూ చేస్తే కచ్చితంగా మైలవరం నుంచే బరిలో ఉంటా. నేను, నా కొడుకు జీవిత కాలం వైసీపీలోనే ఉంటాం. నన్ను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళానన్నారు. ఆధారాలతో సహా చూపించానన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అన్ని విషయాలు తీసుకుని వెళతానన్నారు. ఇతర విషయాలు పట్టించుకోవద్దు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేసుకోమ్మని సజ్జల సూచించారని నిన్ననే కామెంట్ చేశారు.
మైలవరం నియోజకవర్గంలో కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ, ఆవివాదానికి వైసీపీ అధిష్టానం ఏవిధంగా చెక్ పెడుతుందో చూడాలంటున్నారు పార్టీ నేతలు.
తాజావార్తలు
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!