Asaduddin Owaisi: “మీరు పెళ్లి చేసుకోండి”.. మోదీ సర్కార్ను నమ్మవద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేశారని.. 8 ఏళ్లు గడిచాయి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సంఖ్యను కేవలం 10 లక్షలకు తగ్గించారని విమర్శించారు.
ఉద్యోగాల ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హామీలపై జోక్ పేల్చారు. తాను ఇటీవల ఓ హోటల్ లో ఓ యువకుడిని కలిశానని.. అతను తన జీవితంలో పరిస్థితిని వివరించారని అన్నారు. ‘‘ నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించిందని.. మా నాన్న నాకు వేరే పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడని అమ్మాయి చెప్పింది.’’ అని సదరు యువకుడు తనతో అన్నాడని మంగళవారం గుజరాత్ లో జరిగిన ర్యాలీలో ఓవైసీ అన్నారు. అయితే నేను ఆ అబ్బాయితో ‘‘ మీరు పెళ్లి చేసుకోండి, మోదీ ప్రభుత్వాన్ని నమ్మవద్దు’’ అని చెప్పానని ఓవైసీ అన్నారు.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
Read Also: IT Raids Marri Rajashekar Reddy: బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన అన్నారు. 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇటీవల గుజరాత్ మోర్బీలో జరిగిన వంతెన దుర్ఘటనకు అధికార బీజేపీ పార్టీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గుజరాత్ ను తయారు చేసిన ఘనత బీజేపీదే అయితే.. కూలిన వంతెన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోర్బీ ఘటనకు కారణం అయిన కంపెనీకి చెందిన ధనవంతును పట్టుకోలేదని విమర్శించారు.
గత వారం గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం సూరత్ వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తాకింది. కొంత మంది ఆయన ర్యాలీలో ఉండగా మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలను చూపించారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 1,5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!