Asaduddin Owaisi: “మీరు పెళ్లి చేసుకోండి”.. మోదీ సర్కార్ను నమ్మవద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేశారని.. 8 ఏళ్లు గడిచాయి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సంఖ్యను కేవలం 10 లక్షలకు తగ్గించారని విమర్శించారు.
ఉద్యోగాల ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హామీలపై జోక్ పేల్చారు. తాను ఇటీవల ఓ హోటల్ లో ఓ యువకుడిని కలిశానని.. అతను తన జీవితంలో పరిస్థితిని వివరించారని అన్నారు. ‘‘ నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించిందని.. మా నాన్న నాకు వేరే పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడని అమ్మాయి చెప్పింది.’’ అని సదరు యువకుడు తనతో అన్నాడని మంగళవారం గుజరాత్ లో జరిగిన ర్యాలీలో ఓవైసీ అన్నారు. అయితే నేను ఆ అబ్బాయితో ‘‘ మీరు పెళ్లి చేసుకోండి, మోదీ ప్రభుత్వాన్ని నమ్మవద్దు’’ అని చెప్పానని ఓవైసీ అన్నారు.
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
Read Also: IT Raids Marri Rajashekar Reddy: బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన అన్నారు. 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇటీవల గుజరాత్ మోర్బీలో జరిగిన వంతెన దుర్ఘటనకు అధికార బీజేపీ పార్టీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గుజరాత్ ను తయారు చేసిన ఘనత బీజేపీదే అయితే.. కూలిన వంతెన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోర్బీ ఘటనకు కారణం అయిన కంపెనీకి చెందిన ధనవంతును పట్టుకోలేదని విమర్శించారు.
గత వారం గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం సూరత్ వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తాకింది. కొంత మంది ఆయన ర్యాలీలో ఉండగా మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలను చూపించారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 1,5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!