Asaduddin Owaisi: “మీరు పెళ్లి చేసుకోండి”.. మోదీ సర్కార్ను నమ్మవద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేశారని.. 8 ఏళ్లు గడిచాయి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సంఖ్యను కేవలం 10 లక్షలకు తగ్గించారని విమర్శించారు.
ఉద్యోగాల ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హామీలపై జోక్ పేల్చారు. తాను ఇటీవల ఓ హోటల్ లో ఓ యువకుడిని కలిశానని.. అతను తన జీవితంలో పరిస్థితిని వివరించారని అన్నారు. ‘‘ నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించిందని.. మా నాన్న నాకు వేరే పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడని అమ్మాయి చెప్పింది.’’ అని సదరు యువకుడు తనతో అన్నాడని మంగళవారం గుజరాత్ లో జరిగిన ర్యాలీలో ఓవైసీ అన్నారు. అయితే నేను ఆ అబ్బాయితో ‘‘ మీరు పెళ్లి చేసుకోండి, మోదీ ప్రభుత్వాన్ని నమ్మవద్దు’’ అని చెప్పానని ఓవైసీ అన్నారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: IT Raids Marri Rajashekar Reddy: బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన అన్నారు. 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇటీవల గుజరాత్ మోర్బీలో జరిగిన వంతెన దుర్ఘటనకు అధికార బీజేపీ పార్టీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గుజరాత్ ను తయారు చేసిన ఘనత బీజేపీదే అయితే.. కూలిన వంతెన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోర్బీ ఘటనకు కారణం అయిన కంపెనీకి చెందిన ధనవంతును పట్టుకోలేదని విమర్శించారు.
గత వారం గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం సూరత్ వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తాకింది. కొంత మంది ఆయన ర్యాలీలో ఉండగా మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలను చూపించారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 1,5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!