Gudivada Amarnath: ప్రధాని మోడీ-పవన్ భేటీపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వారికి ఓట్లు, సీట్లు రెండూ లేవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీ పర్యటనకు రానున్నారు.. విశాఖలో ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. బీజేపీ-జనసేన పొత్తుతో పాటు మరికొన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. పవన్ మరింత దూకుడు చూపించే స్టెప్ తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది.. అయితే, ప్రధాని మోడీ-పవన్ కల్యాణ్ సమావేశాన్ని లైట్గా తీసుకుంటుంది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ పెద్దగా చుడాల్సిన, చర్చచేయాల్సిన పనిలేదని కొట్టిపారేశారు.. గత కొంతకాలంగా బీజేపీ, జనసేన పొత్తు ఉంది.. అయినా.. రాష్ట్రంలో జనసేనకు, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని సెటైర్లు వేశారు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన పుర్తిగా ప్రభుత్వ కార్యక్రమం… గవర్నర్, సీఎం స్వాగతం పలుకుతారన్న ఆయన.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.. రాష్ర్టం తరపున గౌరవించాలనే పెద్ద ఎత్తున మూడు లక్షల మందితో జనసమీకరణ చేస్తున్నామని వెల్లడించారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ఇక, భారతీయ జనతా పార్టీ ఇచ్చే రోడ్ మ్యాప్లోకి తెలుగు దేశం పార్టీని ఎలా తీసుకెళ్లాలని భావిస్తున్నారు? అంటూ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.. జనసేన అధినేత పాత్ర మాత్రం టీడీపీనీ, బీజేపీని కలిపే ప్రయత్నమేనని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలు , స్ర్కిప్ట్ లపైనే పవన్ కల్యాణ్ ఆలోచన ఉంది అంటూ మండిపడ్డారు.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగాలని , ఆలోచించాలని కోరుతున్నానంటూ సలహాఇచ్చారు.. విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు భావిస్తున్నారు, దానిని పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, రెండో రోజుల విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీతో ఇవాళ రాత్రి సమావేశం కానున్నారు పవన్.. సాయంత్రం 5 గంటలకు విశాఖకు చేరుకోనున్న పవన్.. రాత్రి 8.30 గంటలకు మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల వైజాగ్ పర్యటనలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పవన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!