Gudivada Amarnath: ప్రధాని మోడీ-పవన్ భేటీపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వారికి ఓట్లు, సీట్లు రెండూ లేవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీ పర్యటనకు రానున్నారు.. విశాఖలో ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. బీజేపీ-జనసేన పొత్తుతో పాటు మరికొన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. పవన్ మరింత దూకుడు చూపించే స్టెప్ తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది.. అయితే, ప్రధాని మోడీ-పవన్ కల్యాణ్ సమావేశాన్ని లైట్గా తీసుకుంటుంది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ పెద్దగా చుడాల్సిన, చర్చచేయాల్సిన పనిలేదని కొట్టిపారేశారు.. గత కొంతకాలంగా బీజేపీ, జనసేన పొత్తు ఉంది.. అయినా.. రాష్ట్రంలో జనసేనకు, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని సెటైర్లు వేశారు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన పుర్తిగా ప్రభుత్వ కార్యక్రమం… గవర్నర్, సీఎం స్వాగతం పలుకుతారన్న ఆయన.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.. రాష్ర్టం తరపున గౌరవించాలనే పెద్ద ఎత్తున మూడు లక్షల మందితో జనసమీకరణ చేస్తున్నామని వెల్లడించారు.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ఇక, భారతీయ జనతా పార్టీ ఇచ్చే రోడ్ మ్యాప్లోకి తెలుగు దేశం పార్టీని ఎలా తీసుకెళ్లాలని భావిస్తున్నారు? అంటూ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.. జనసేన అధినేత పాత్ర మాత్రం టీడీపీనీ, బీజేపీని కలిపే ప్రయత్నమేనని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలు , స్ర్కిప్ట్ లపైనే పవన్ కల్యాణ్ ఆలోచన ఉంది అంటూ మండిపడ్డారు.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగాలని , ఆలోచించాలని కోరుతున్నానంటూ సలహాఇచ్చారు.. విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు భావిస్తున్నారు, దానిని పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, రెండో రోజుల విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీతో ఇవాళ రాత్రి సమావేశం కానున్నారు పవన్.. సాయంత్రం 5 గంటలకు విశాఖకు చేరుకోనున్న పవన్.. రాత్రి 8.30 గంటలకు మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల వైజాగ్ పర్యటనలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పవన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!