Gudivada Amarnath: ఉగాది నాటికి విశాఖలో వైసీపీ ఆఫీస్ నిర్మాణం పూర్తి
Gudivada Amarnath: విశాఖలో రెండో రోజు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజు, ఎమ్మెల్సీలు వంశీ, వరుదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఉగాది నాటికి వైసీపీ కార్యాలయం నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ భవనమే వైసీపీ ప్రధాన కార్యాలయం కాబోతుందని తెలిపారు.
రాష్ట్రానికి భవిష్యత్ విశాఖపట్నం అని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 175 స్థానాల్లో విజయం సాధించాలన్న సీఎం లక్ష్యం నెరవేర్చే ప్రయత్నం విశాఖ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. విశాఖలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు జరగడం సంతోషకరమని.. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా కళలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
Read Also: Christmas Gift : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.80లక్షల బోనస్
అటు ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, గుంటూరు-విజయవాడ, రాజమండ్రిలో స్వర్ణోత్సవ సంబరాలు పూర్తయ్యాయని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంబించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతం అని.. విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళలు అన్నింటినీ ప్రోత్సహిస్తామన్నారు. మరోవైపు మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పండగలా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి రోజాకు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!