Minister Gudivada Amarnath: విశాఖ ఇమేజ్ను కావాలనే డ్యామేజ్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్ పర్యటన వివరాల గురించి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం సాయంత్రం విశాఖలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే తాము దావోస్కు వెళ్లామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్లో వివరించామని.. సుమారు 50 ఎమ్మెన్సీ కంపెనీలతో చర్చలు జరిగినట్లు ఆయన వివరించారు. అయితే విశాఖ ఇమేజ్ను ప్రపంచ స్థాయిలో ఎంతగా దెబ్బతీయాలో కొందరు అంత ప్రయత్నం చేశారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు.
Chandra Babu: రాబోయే ఎన్నికల్లో వార్ వన్సైడే..!!
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
దావోస్ వేదికగా జరిగిన చర్చల్లో ఓ MNC ప్రతినిధి తన దగ్గర తీసుకుని వచ్చి విశాఖ ఇమేజ్ విషయంపై ప్రస్తావించగానే తాను నిర్ఘాంతపోయానని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తే విశాఖ మునిగిపోతుందట.. అక్కడ పెట్టుబడులు ఏ విధంగా సాధ్యమని ఓ కంపెనీ ప్రతినిధి ప్రశ్నించారని చెప్పారు. తమ ప్రభుత్వంపై విషం చిమ్మినా.. తమ పార్టీపై విషం చిమ్మినా ఊరుకుంటాం కానీ ప్రాంతాలపై విషప్రచారం చేసేవారిని ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖ నగర ప్రతిష్టను దెబ్బతీయవద్దని అందరినీ వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పారిశ్రామిక, ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ ఆటో పైలెట్ మోడ్లో ఉందని.. పెట్టుబడులను ఆకర్షించడంలో తాము ఎవరితోనూ పోటీ పెట్టుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచ దేశాలకు ఏపీ దిక్సూచిగా నిలవనుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటికే సీఎం జగన్ శంకుస్టాపన చేసిన గ్రీన్ కో రెనూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా 5 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుందని తెలిపారు. కర్నూలు గ్రీన్ కో ఎనర్జీ ప్లాంట్ మాదిరే రాష్ట్రంలోని మరో 29 ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను గుర్తించామన్న మంత్రి… అవన్నీ అందుబాటులోకి వస్తే… ఒక్క ఏపీ నుంచే 30 వేలకు పైగా మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు.
కాగా ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించాల్సి ఉండటంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!