Minister Botsa: యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు.
ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో పాటు విద్య , వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు దేశంలోనే అత్యుత్తమ వాటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నది సీఎం జగన్ విజన్ అని తెలిపారు. ఈ దిశగా యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు పనిచేయాలని సూచించారు. యూనివర్సిటీల్లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి తాను చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
తాజావార్తలు
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!