Ambati Rambabu: మళ్ళీ జగనే సీఎం…175 సీట్లు మావే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది వైసీపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల గురించే చర్చ సాగుతోంది. విపక్షాలపై విరచుకుపడుతూ వైసీపీ నేతలు ప్లీనరీలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విద్య కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.
కరోనా సమయంలో జగన్ లాంటి సీఎం లేకపోతే పరిస్థితి దారుణంగా వుండేది. విజయవాడ సెంట్రల్ లో కరోనా సమయంలో అనేక సేవలు అందించాం. 2024 లో వైకాపా కు కంచుకోటగా సెంట్రల్ నియోజకవర్గం వుంటుందన్నారు. ఏ రాజకీయ పార్టీకి నవరత్నాలతో పోటీపడే ఛాన్స్ లేదు. ప్లీనరీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మంత్రి అంబటి రాంబాబు, హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్, మేయర్, డిప్యూటీ మేయర్, హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు దే విజయం… వంగవీటి రాధా వచ్చిన ఎవరు వచ్చిన వైసీదే విజయం అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
Also Read
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
పవన్ ఊడిగం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసీపీకే సొంతం అవుతాయన్నారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గల్లో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించటానికి గడప గడపకి వెళ్తున్నాం. టిడిపి కి, పవన్ కళ్యాణ్ కు ఓటు వేసిన వారి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు వివరిస్తున్నాము. గ్లాసు కు ఓటు వేసిన నాకు కాపు నేస్తం వచ్చింది అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు.
జగన్ ను సింగిల్ గా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదు. అయ్యన్న పాత్రునికి నోరు విప్పితే బూతులే. ఎన్ని జన్మలెత్తిన చంద్రబాబు సీఎం కాలేడు. చంద్రబాబు కు జై కొట్టే వాళ్ళు ఇద్దరే… లోకేష్, అతని దత్త పుత్రుడు పవన్ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తో వస్తవో ఎవరితో వస్తావో.. రా…. కట్టకట్టి కృష్ణ నదిలో కలిపేస్తాం. రాష్ట్రంలో పవన్ కు సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అన్నారు.
LIVE : శివసేనకు షాక్..! ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీ..?
తాజావార్తలు
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్