Mekapati Vikram Reddy: లోకేష్కి ఎమ్మెల్యే మేకపాటి సవాల్.. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mekapati Vikram Reddy Challenges To Nara Lokesh To Debate On Development: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని.. టైం, ప్లేస్ చెప్పాలని నారా లోకేష్కు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆత్మకూరులో అభివృద్ధి ఏమీ లేదని మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి, నిజాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. తాము సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ.. ఇప్పుడు ఆ వైసీపీ పథకాలనే కాపీ కొడుతోందని దుయ్యబట్టారు.
Bandi Sanjay: అభివృద్ధి నిధుల పై ముఖ్యమంత్రి చర్చకి వస్తారా? బండి సంజయ్ సవాల్!
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
2014లో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి.. రాష్ట్రం విడిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం పాకులాడిన ఆనం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదని అన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీగా ఉన్నప్పుడు హై లెవల్ కెనాల్కు ప్రతిపాదన చేస్తే.. రాజశేఖర్ రెడ్డి హయాంలో దానికి రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన వారితో పాటు సోమశిల హై లెవల్ కెనాల్కు కారణమైన వారి గురించి ఆనం అసలు మాట్లాడకపోవడం సరికాదని మండిపడ్డారు. ఇసుక, మట్టి ద్వారా అవినీతి జరిగిందన్న ఆనం.. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు. కేవలం తన సొంత అభివృద్ధి కోసమే 40 ఏళ్ల నుంచి ఆనం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ సభల కోసం ప్రజలకు డబ్బులిచ్చినా ప్రజలు రాలేదని ఎద్దేవా చేశారు.
New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
అంతకుముందు కూడా.. రాష్ట్ర విభజనకు ఆనం కారణమంటూ మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆనంకు మంత్రి పదవి ఎవరి వల్ల వచ్చిందో తనకు తెలుసన్న ఆయన.. ఎమ్మెల్యేగా, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆనం ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. 2019లో వైసీపీలోకి వచ్చి, ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వెళ్లిన ఆనం.. లోకేష్ పాదయాత్రలో అభివృద్ధి జరగలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. తనపై లోకేష్ చేస్తున్న ఆరోపణల్ని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే లోకేష్ ఇంకెప్పుడు ఆత్మకూరు వైపు రాకూడదని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?