New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Bride Escape: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బంధాలు అనుబంధాలకు పరిగణనలోకి తీసుకోకుండా ఆర్థిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు కోసం ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులను వలపన్ని వారిని మోసం చేసి డబ్బులతో పరార్ అవుతున్నారు. అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు.వివాహానే దొంగతనాలకు దారిగా ఎంచుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన తర్వాత పెళ్లికూతుర్లు నగలు, నగదులో ఉడాయించిన సంఘటనలు మనం గతంలో చూశాము. మరోసారి మెదక్ జిల్లాలో ఇదే సీన్ రిపీట్ అయింది. పెళ్లి పేరుతో ఓ యువకుడిని మరో రాష్ట్రానికి చెందిన యువతి మోసం చేసింది. కాగా.. పెళ్లైన నెలరోజులకే ఇంట్లో దాచి ఉంచిన రూ. 2 లక్షల నగదుతో ఉడాయించింది. ఇక మోసపోయిన యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మెదక్ జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన రాజేశ్వర్ పటాన్చెరు మండలం పాశమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఒడిశాకు చెందిన యువతి రష్మిక ప్రవాలాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 23న ఓ గుడిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం పాశమైలారంలోనే కాపురం పెట్టారు. రష్మిక ఇంట్లోనే ఉండగా రాజేశ్వర్ ఇండస్ట్రీకి వెళ్లేవాడు. కానీ రాజేశ్వర్ ఇటీవల రూ. 2 లక్షల నగదును తిరిగి సేకరించి ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఆ డబ్బుపై రష్మిక కళ్లు పడ్డాయి.
Also Read
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. సమయం కోసం ఎదురుచూసింది. రాజేశ్వర్ శనివారం పరిశ్రమకు వెళ్లగా, ఇంట్లో రష్మిక ఒంటరిగా ఉంది. ఇదే సమయం అని భావించిన రష్మిక రూ. 2 లక్షలతో పరారైంది. ఇంటి వచ్చిన రాజేశ్వర్ కు రష్మిక కనిపించలేదు భార్య ఏమైపోయిందో అని కంగారు పడ్డ రాజేశ్వర్ కు మరో విషయం తెలిసింది. అదే తను వసూలు చేసిన రూ. 2 లక్షలు కూడా మాయమయ్యాయని. తను మోసపోయానని గమనించిన రాజేశ్వర్ BDL భానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనను ప్రేమ పేరుతో మోసం చేసి రూ. 2 లక్షలతో తన భార్య పరారయ్యిందని తనకు న్యాయం చేయాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!