Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Retired Ips Officer Ab Venkateswara Rao Comments On Banakacherla Project

AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్‌ కామెంట్లు..

Published Date :August 6, 2025 , 7:50 pm
By Sudhakar Ravula
  • పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై..
  • మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు..
  • పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టు..
  • ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు..
AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్‌ కామెంట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AB Venkateswara Rao: పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై హాట్‌ కామెంట్లు చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్నారు.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారు.. కర్నూలులో ఆలోచనపరుల వేదిక ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టుల విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సీపీఐ నేత రామచంద్రయ్య, సాగునీటి సాధన సమితి దాసరథరామిరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: Yash Dayal: అత్యాచారం కేసులో ఆర్‌సీబీ ప్లేయర్‌కు భారీ ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా..?

పోలవరం – బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించింది ఆలోచనపరుల వేదిక.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మరో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వవద్దని, నాయకులు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయాలే ప్రాధాన్యతగా నాయకులు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర కన్నీళ్లు తుడవాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం సమన్వయం సాధించాలని ఆలోచనపరుల వేదిక అభిప్రాయపడింది. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా అభివర్ణించారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారాయన. ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల కోట్లు అంటున్నా పూర్తయ్యే నాటికి లక్షా 50 వేల కోట్లు అవుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు ప్రతిపాదిస్తే ప్రతిపక్షం రాజకీయంగా చర్చించి మంచి చెడులు చెప్పడం సహజమని, ప్రతిపక్షం వున్నా లేనట్టు నటిస్తుందని, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షం నోరుమేధపడం లేదన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.

Read Also: Rajasingh : ముఖ్యమంత్రి గారూ.. ముస్లింలు ఏమైనా బీసీలా..?

ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల కోట్లు అంటున్నా పూర్తయ్యే నాటికి లక్షా 50 వేల కోట్లు అవుతుంది.. ఇలాంటి ప్రాజెక్టు ప్రతిపాధిస్తే ప్రతిపక్షం రాజకీయంగా చర్చించి మంచి చెడులు చెప్పడం సహజం.. ప్రతిపక్షం వున్నా లేనట్టు నటిస్తుందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షం నోరుమేధపడం లేదు.. గత ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.. పోలవరం – బనకచర్ల వల్ల రైతులకు ప్రయోజనం లేదు.. రాయలసీమలో ఒక్క ఎకరాకు అదనంగా నీరు అందదు.. కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించడం కంటే ఇప్పటికే పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం లాభదాయకం.. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది.. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. ఎస్సార్బీసీ కింద రూ.250 కోట్లు ఖర్చు చేస్తే ఇంకా 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది అన్నారు.. గోదావరి జలాల పంపిణీపై స్పష్టత లేదు.. రెండు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీ తరువాతనే మిగులు జలాలు ఎన్నో తేలుతుందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.

Read Also: Rajasingh : ముఖ్యమంత్రి గారూ.. ముస్లింలు ఏమైనా బీసీలా..?

కృష్ణా జలాల పై తెలంగాణ అబద్ధాలు చెబుతోందన్నారు మాజీ ఐపీఎస్‌ వెంకటేశ్వరరావు.. రాయలసీమ నీరు దోచుకుంటుందనే తెలంగాణ వాదన అబద్ధం అని నిరూపిస్తాం.. ఎవరైనా వచ్చి చూసుకోవచ్చని ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు.. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు కూడా డ్రా చేయలేని పరిస్థితి.. 37 వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేయవచ్చు.. గాలేరు-నగరి నుంచి పంట కాలువలు లేకుండా రైతుల పొలాలకు నీరివ్వలేని పరిస్థితి ఉందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AB Venkateswara Rao
  • Andhra Pradesh
  • Banakacherla Project
  • Polavaram - banakacherla
  • Retired IPS officer AB Venkateswara Rao

తాజావార్తలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

  • Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?

  • CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions