PM Modi AP Tour: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. జోరుగా కొనసాగుతున్న ఏర్పాట్లు..
- రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..
- ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
- నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ..
- 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేసిన అధికారులు..
- ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైలం ఆలయంలో ప్రధాని మోడీ పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Tour: రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఇక, వీవీఐపీ పార్కింగ్ కోసం 17 ఎకరాలు, వీఐపీ పార్కింగ్ కోసం 33 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, పబ్లిక్ వాహనాల పార్కింగ్ కోసం 342 ఎకరాలను కేటాయించారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేయగా, పబ్లిక్ మీటింగ్ తో పాటు పార్కింగ్, హెలిప్యాడ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Read Also: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్పెక్ట్.. 3 మ్యాచ్లలో 2 సెంచరీలు చేస్తాడు!
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
అయితే, 11 పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్స్, 2 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ప్రదేశంలో వీఐపీల కోసం రెండు 10 పడకల ఆసుపత్రులు, ప్రజల కోసం 20 పడకల ఆసుపత్రిని సైతం సిద్ధం చేశారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లలో 8 మంది మంత్రులు, 35 మంది ఐఏఎస్ అధికారులు, 37 మంది ఐపీఎస్ అధికారులు, 200 మంది రాష్ట్ర స్థాయి అధికారులు, 19 డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
Read Also: Insurance Fraud Murder: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వృద్ధుడి హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి!
అలాగే, ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైల ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ. 13, 430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనుండగా.. రూ. 2,880 కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్తోనే హైప్!
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!