PM Modi AP Tour: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. జోరుగా కొనసాగుతున్న ఏర్పాట్లు..
- రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..
- ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
- నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ..
- 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేసిన అధికారులు..
- ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైలం ఆలయంలో ప్రధాని మోడీ పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Tour: రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఇక, వీవీఐపీ పార్కింగ్ కోసం 17 ఎకరాలు, వీఐపీ పార్కింగ్ కోసం 33 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, పబ్లిక్ వాహనాల పార్కింగ్ కోసం 342 ఎకరాలను కేటాయించారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేయగా, పబ్లిక్ మీటింగ్ తో పాటు పార్కింగ్, హెలిప్యాడ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Read Also: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్పెక్ట్.. 3 మ్యాచ్లలో 2 సెంచరీలు చేస్తాడు!
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
అయితే, 11 పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్స్, 2 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ప్రదేశంలో వీఐపీల కోసం రెండు 10 పడకల ఆసుపత్రులు, ప్రజల కోసం 20 పడకల ఆసుపత్రిని సైతం సిద్ధం చేశారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లలో 8 మంది మంత్రులు, 35 మంది ఐఏఎస్ అధికారులు, 37 మంది ఐపీఎస్ అధికారులు, 200 మంది రాష్ట్ర స్థాయి అధికారులు, 19 డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
Read Also: Insurance Fraud Murder: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వృద్ధుడి హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి!
అలాగే, ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైల ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ. 13, 430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనుండగా.. రూ. 2,880 కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Kamakshi: “సెక్స్ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!