PM Modi AP Tour: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. జోరుగా కొనసాగుతున్న ఏర్పాట్లు..
- రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..
- ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
- నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ..
- 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేసిన అధికారులు..
- ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైలం ఆలయంలో ప్రధాని మోడీ పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Tour: రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఇక, వీవీఐపీ పార్కింగ్ కోసం 17 ఎకరాలు, వీఐపీ పార్కింగ్ కోసం 33 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, పబ్లిక్ వాహనాల పార్కింగ్ కోసం 342 ఎకరాలను కేటాయించారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేయగా, పబ్లిక్ మీటింగ్ తో పాటు పార్కింగ్, హెలిప్యాడ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Read Also: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్పెక్ట్.. 3 మ్యాచ్లలో 2 సెంచరీలు చేస్తాడు!
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
అయితే, 11 పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్స్, 2 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ప్రదేశంలో వీఐపీల కోసం రెండు 10 పడకల ఆసుపత్రులు, ప్రజల కోసం 20 పడకల ఆసుపత్రిని సైతం సిద్ధం చేశారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లలో 8 మంది మంత్రులు, 35 మంది ఐఏఎస్ అధికారులు, 37 మంది ఐపీఎస్ అధికారులు, 200 మంది రాష్ట్ర స్థాయి అధికారులు, 19 డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
Read Also: Insurance Fraud Murder: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వృద్ధుడి హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి!
అలాగే, ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైల ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ. 13, 430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనుండగా.. రూ. 2,880 కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!