IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్పెక్ట్.. 3 మ్యాచ్లలో 2 సెంచరీలు చేస్తాడు!
- ఆస్ట్రేలియా పర్యటనకు భారత్
- వన్డే సిరీస్లో ఆడనున్న రోహిత్, కోహ్లీ
- ఫిట్నెస్లో కింగ్ పర్పెక్ట్ అని హర్భజన్ ప్రశంస
వెస్టిండీస్తో భారత్ టెస్ట్ సిరీస్ ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. శుభ్మన్ గిల్కు కెప్టెన్గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. వన్డే సిరీస్లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడనున్నారు. ఐపీఎల్ 2025 తర్వాత ఇద్దరూ మైదానంలోకి దిగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీలు సన్నదమవుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఫిట్నెస్లో కింగ్ పర్పెక్ట్ అని ప్రశంసించాడు.
వన్డే సిరీస్లోని మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేస్తాడని హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఫిట్నెస్లో కింగ్ మిస్టర్ పర్పెక్ట్. ప్రస్తుత ఆటగాళ్లలో అందరి కంటే విరాట్ ఫిట్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కోహ్లీ ఫిటెస్ట్ ప్లేయర్, ఇందులో సందేహమే లేదు. విరాట్ ఆట కోసం నేను ఎదురుచూస్తున్నా. అతడు మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆస్ట్రేలియాలో కోహ్లీ భారీగా పరుగులు చేశాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీ రాణిస్తాడని నమ్మకంగా ఉన్నా. వన్డే సిరీస్లోని 3 మ్యాచ్లలో కనీసం 2 సెంచరీలు చేస్తాడని భావిస్తున్నా. రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. ఇద్దరి ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Also Read: Gautam Gambhir:: 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ.. గంభీర్ రియాక్షన్ ఇదే!
ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 29 వన్డేలు ఆడిన విరాట్.. 51.03 సగటుతో 1327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో కూడా విరాట్ ఆకటుకున్నాడు. ఈ నేపథ్యంతోనే విరాట్ చెలరేగుతాడని హర్భజన్ నమ్మకంగా ఉన్నాడు. మంగళవారం కింగ్ లండన్ నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నాడు. భారత జట్టుతో కలిసి ఈరోజు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం కోహ్లీ లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?