Kurnool Market Yard: మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ఉల్లి నిల్వలు.. రైతుల ఆందోళన
- కర్నూలు జిల్లాలో ఉల్లిరైతుల కష్టాలు..
- భారీగా తరలివచ్చిన ఉల్లిపంట..
- మార్కెట్ యార్డులో స్థలం లేక బయటే నిలిచిన ఉల్లిలారీలు..
- వారంలో మూడురోజులే ఉల్లి అమ్మకాలు.. కొనుగోళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Market Yard: ఓ వైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు మండిపోతుంటే.. మరోవైపు.. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.. రాత్రి కిలోమీటర్ పొడవునా ఉల్లి లోడ్తో వచ్చిన లారీలు నిలిచిపోయాయి.. ఉల్లి అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే, వారంలో 3 రోజులు కొనుగోళ్ల నిర్ణయంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.. ఉల్లికి డిమాండ్ వున్నా, ధర వున్నా అధికారుల తీరుతో రైతులకు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
ఉల్లికి ఎక్కువగా మార్కెట్ కు వస్తే సమస్య తలెత్తకుండా పరిష్కారం చేయడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు మండిపడుతున్నారు.. 10 రోజులుగా ఉల్లి రైతుల సమస్య పరిష్కరించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు.. అయితే, క్వింటాలు ఉల్లి 2 వేల నుంచి 4,600 వరకు ధర పలుకుతోంది.. కానీ, కొనుగోలులో జాప్యంతో ఉల్లి మురిగిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. నాణ్యత దెబ్బతిన్న ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు.. మొత్తంగా పంటను మార్కెట్ యార్డులో అమ్మేందుకు తీసుకెళ్లిన రైతన్నలు.. లోపల స్థలం లేకపోవడంతో రోడ్లపై నిలిపివేశారు. దీంతో గంటల తరబడి రైతులు.. రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు. తమ వద్ద తిండికి సైతం పైసలు లేవని… వేగంగా పంటను లోపలకు తీసుకెళ్లేందుకు వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
నిజానికి అర్థరాత్రి 12 గంటల నుంచి మార్కెట్ యార్డులోకి ఉల్లిపంటకు అనుమతి ఉంది. వారంలో మూడురోజులే ఉల్లి అమ్మకాలు.. కొనుగోళ్లు ఉండడంతో అధికంగా సరుకువచ్చింది. మార్కెట్లో స్థలం లేకపోవడంతో రోడ్డు మీదే ఉల్లి లారీలు నిలిచిపోయాయి. ఫలితంగా తీవ్రమైన లోపల ఉల్లి కొనుగోళ్లు వేగవంతం చేస్తే.. యార్డులో స్థలం దొరుకుతుందని, తాము పంటను విక్రయించుకుంటామంటున్నారు దీనికి తోడు మార్కెట్లోనూ ధరలు రోజుకోరకంగా ఉంటున్నాయి. అయితే బయట మరీ క్వింటా 3వేలు లోపల పలుకుతుండడంతో..రైతులు మార్కెట్ లోపల అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ యార్డు బయట ఎదురవుతున్న పరిస్థితులు వారికి పరీక్ష పెడుతుండడంతో.. పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రావొద్దని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!