US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Plane Crash: అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంప్కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. పసిఫిక్ ఏరోస్పేస్ పీ750 స్కైడైవింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. విమానంలో పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
మృతుడు సాయి కార్తీక్ వర్మ, సుబ్రమణ్యం రాజు కుమారుడు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాగా, కుటుంబం చాలా కాలంగా కర్నూలు జిల్లా కౌతాళంలో స్థిరపడింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన కార్తీక్, ఇటీవలే తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ’లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కార్తీక్, ప్రస్తుతం కాన్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్నాడు. సరదాగా స్కైడైవింగ్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
కార్తీక్ మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కార్తీక్ మృతదేహం భీమవరం చేరుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో కౌతాళం, భీమవరం ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతిభావంతమైన యువకుడి అకాల మరణం పట్ల బంధువులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!