Kurnool Market Yard: మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ఉల్లి నిల్వలు.. రైతుల ఆందోళన
- కర్నూలు జిల్లాలో ఉల్లిరైతుల కష్టాలు..
- భారీగా తరలివచ్చిన ఉల్లిపంట..
- మార్కెట్ యార్డులో స్థలం లేక బయటే నిలిచిన ఉల్లిలారీలు..
- వారంలో మూడురోజులే ఉల్లి అమ్మకాలు.. కొనుగోళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Market Yard: ఓ వైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు మండిపోతుంటే.. మరోవైపు.. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.. రాత్రి కిలోమీటర్ పొడవునా ఉల్లి లోడ్తో వచ్చిన లారీలు నిలిచిపోయాయి.. ఉల్లి అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే, వారంలో 3 రోజులు కొనుగోళ్ల నిర్ణయంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.. ఉల్లికి డిమాండ్ వున్నా, ధర వున్నా అధికారుల తీరుతో రైతులకు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
ఉల్లికి ఎక్కువగా మార్కెట్ కు వస్తే సమస్య తలెత్తకుండా పరిష్కారం చేయడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు మండిపడుతున్నారు.. 10 రోజులుగా ఉల్లి రైతుల సమస్య పరిష్కరించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు.. అయితే, క్వింటాలు ఉల్లి 2 వేల నుంచి 4,600 వరకు ధర పలుకుతోంది.. కానీ, కొనుగోలులో జాప్యంతో ఉల్లి మురిగిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. నాణ్యత దెబ్బతిన్న ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు.. మొత్తంగా పంటను మార్కెట్ యార్డులో అమ్మేందుకు తీసుకెళ్లిన రైతన్నలు.. లోపల స్థలం లేకపోవడంతో రోడ్లపై నిలిపివేశారు. దీంతో గంటల తరబడి రైతులు.. రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు. తమ వద్ద తిండికి సైతం పైసలు లేవని… వేగంగా పంటను లోపలకు తీసుకెళ్లేందుకు వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
నిజానికి అర్థరాత్రి 12 గంటల నుంచి మార్కెట్ యార్డులోకి ఉల్లిపంటకు అనుమతి ఉంది. వారంలో మూడురోజులే ఉల్లి అమ్మకాలు.. కొనుగోళ్లు ఉండడంతో అధికంగా సరుకువచ్చింది. మార్కెట్లో స్థలం లేకపోవడంతో రోడ్డు మీదే ఉల్లి లారీలు నిలిచిపోయాయి. ఫలితంగా తీవ్రమైన లోపల ఉల్లి కొనుగోళ్లు వేగవంతం చేస్తే.. యార్డులో స్థలం దొరుకుతుందని, తాము పంటను విక్రయించుకుంటామంటున్నారు దీనికి తోడు మార్కెట్లోనూ ధరలు రోజుకోరకంగా ఉంటున్నాయి. అయితే బయట మరీ క్వింటా 3వేలు లోపల పలుకుతుండడంతో..రైతులు మార్కెట్ లోపల అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ యార్డు బయట ఎదురవుతున్న పరిస్థితులు వారికి పరీక్ష పెడుతుండడంతో.. పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రావొద్దని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!