Kurnool Crime: కుళాయి వద్ద ఘర్షణ.. పచ్చని పల్లెలో రక్తపాతం.. నలుగురి హత్య..!
- నీళ్ల పంచాయితీకి నలుగురు బలి..
- నీళ్ల కుళాయి దగ్గర చెలరేగిన పంచాయితీ.. పాత కక్షలుగా రూపాంతరం..
- ఇది కాస్తా ఫ్యాక్షన్ మర్డర్స్కు దారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: కర్నూలు జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్.. ఇపుడు ఆ పదం వినిపించడమే అరుదు. అలాంటి సమయంలో ఎమ్మిగనూరు మండలం కాందనాతిలో పాత కక్షలు చెలరేగి ఇద్దరు వేటకొడవళ్లకు బలయ్యారు. ఇంట్లో, పొలం వెళ్లే దారిలో, పొలంలో… ఇలా వెంటాడి వేటాడి హత్య చేశారు. ఏడాది క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారమే ఈ హత్యలుగా తేల్చారు.. కందనాతిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబలపై ప్రత్యర్థులు చెలరేగిపోయారు. పరమేష్ అనే వ్యక్తిని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులు పొలంలో ఉన్నారని తెలిసి మూకుమ్మడిగా కొడవళ్లతో వెళ్లారు. పొలం పనులు పూర్తి చేసుకొని ట్రాక్టర్ లో గోవింద్ (45), భార్య వీరేషమ్మ వస్తుడగా వారిపైనా దాడి చేశారు. వేటకొడవళ్ల దాడిలో గోవింద్ పొట్ట చీలిపోయి పేగులు బయటికి వచ్చాయి. వీరేషమ్మ పై దాడి చేయబోగా వేటకొడవలి వేటు ఆమె ఐదేళ్ల కుమారుడు లోకేంద్ర కు పది తీవ్రంగా గాయపడ్డారు. వీరేషమ్మ కేకలు వేయడంతో ప్రత్యర్థులు పొలం వైపు వెళ్లారు. పొలంలో ఉన్న వెంకటేష్ ను కూడా నరికి చంపేశారు. గాయపడిన గోవిందు, ఐదేళ్ల బాలుడు లోకేంద్ర ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
Read Also: Rahul Gandhi: వియత్నాం టూర్లో రాహుల్ గాంధీ.. ‘‘పార్టీ-టూరిజం’’ లీడర్ అని బీజేపీ ఫైర్..
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
ఈ హత్యలకు పాత కక్షలు కారణంగా పోలీసులు తేల్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో కంధనాతిలో దేవర ఉత్సవాలు జరుగుతుండగా రెండు కుటుంబాల మధ్య నీటి కుళాయి వద్ద ఘర్షణ జరిగింది. ఆ రెండు కుటుంబాలు అప్పుడు ఒకరు వైసీపీలో ఉండగా , మరొకరు టీడీపీలో వున్నారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కుటుంబానికి చెందిన బిక్కి నరసింహులు, ఆయన కుమారుడు రవి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తరువాత వారి ప్రత్యర్థులు వెంకటేష్, పరమేష్, గోవిందు కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఏడాది దసరా పండగ సందర్భంలో వెంకటేష్, గోవిందు, పరమేష్ కుటుంబాలు తిరిగి తమ గ్రామం చేరుకున్నారు. అయితే ఈసారి ఈ మూడు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. దీంతో ధైర్యంగానే ఊరు చేరుకున్నారు. అయితే, గత ఏడాది జరిగిన హత్యలతో రగిలిపోతున్న ప్రత్యర్థులు వెంకటేష్, పరమేష్ ను దారుణంగా నరికి హత్య చేశారు.
కందనాతిలో ఈ నెల 5న జరిగిన జంట హత్యల కేసులో రెండు విడతలుగా 25 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుండి ట్రాక్టర్, రెండు బైక్ లు, రెండు ఇనుప గడ్డపారలు, ఒక ఇనుప రాడ్, రెండు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఇంటి దగ్గర నీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణ గ్రామంలో నలుగురి హత్యకు దారితీసింది. ఏడాదిగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినా హత్యలు జరిగాయి. ఎమ్మిగనూరు జాతరకు బందోబస్తులో పోలీసులు ఉండగా ఇదే అవకాశంగా చెలరేగి హత్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!