వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారన్న జగన్ 40 వేల మందికే రైతు భరోసా ఇస్తున్నారు. నీరు చెట్టు పనులు చేసిన రైతులకు టీడీపీ ముద్ర వేసి రూ. 1,700 కోట్లు ఇవ్వకుండా జగన్ రైతుల్ని వేధిస్తున్నారు అని చెప్పారు. వైసీపీ చేత కాని పాలనతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలు చేశారు. తెలంగాణ అధిక వాటా వాడుకుంటున్నా నోరు మెదపటం లేదు అన్నారు. నీరు చెట్టు పనుల్లో ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చే అధికారులపై రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు. జగన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుని నీరు చెట్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలి అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!