Vallabhaneni Vamsi Wife: పోలీస్స్టేషన్ లోపలికి వంశీ భార్యను అనుమతించని పోలీసులు..
- కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య..
- పోలీస్ స్టేషన్ లోపలికి వంశీ భార్యను అనుమతించని పోలీసులు..
- ఆయన ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది: వంశీ భార్య పంకజశ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Wife: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనేక కోణాల్లో దీర్ఘంగా విచారిస్తున్నారు పోలీసులు. టీడీపీ గన్నవరం కార్యాలయం పైనా దాడి నేపథ్యం గురించి ప్రశ్నిస్తున్నారు. దాడిలో ఎంత మంది పాల్గొన్నారు.. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందని అని వంశీని క్వశ్చన్ చేస్తున్నారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని జీజీహెచ్ కు వల్లభనేని వంశీని తరలించనున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పోలీసులు హాజరు పర్చనున్నారు.
Read Also: Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం..
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
అయితే, వల్లభనేని వంశీ కన్ఫెషన్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కొన్ని ఎవిడెన్స్ బేసెస్ గా వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. దీని ఆధారంగా వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. గంట నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Aaditya Thackeray: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది.. ఢిల్లీలో ఆదిత్య ఠాక్రే..
ఇక, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీ సతీమణి వచ్చారు. వంశీని కలిసేందుకు ఆమెను పీఎస్ లోపలకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో మీడియాతో మాట్లాడియా వంశీ భార్య పంకజశ్రీ.. మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని క్వశ్చన్ చేశారు. ఆయన ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది.. వంశీని చూడటానికి లోపలికి పంపాలని ఆమె కోరారు. కాగా, ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. ఎందుకు అరెస్టు చేశారో మాకు ఇంకా తెలియదు.. అడిగినా పోలీసులు ఏం చెప్పడం లేదు.. రిమాండ్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అన్ని ఇస్తామని అంటున్నారు.. అరెస్టు చేసి ఇంత సేపు అవుతుంది.. కానీ, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం ఇల్లీగల్ అని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోతే లీగల్ గా వెళ్లడానికి మాకు అవకాశం ఉండదు అనే ఇలా చేస్తున్నారు అంటూ వంశీ భార్య పంకజశ్రీ మండిపడింది. మరోవైపు, కక్షపూరితంగా వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అంటూ మరోవైపు ఆయన తరపు లాయర్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!