Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: మరోసారి కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 24 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో దేశంలో ముందంజలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ, మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో పడిందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని పేర్ని నాని మండిపడ్డారు. మహిళలపై నెపం మోపడం దారుణమని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రజల ఆస్తులకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించిన ఆయన, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాలేదంటే అప్పుడే ఆర్టీసీని అమ్మేసేవారని వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు ఆర్టీసీని తెలుగుదేశం పార్టీ స్వంత ఆస్తిలా ఉపయోగించుకున్నారని విమర్శించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను చంద్రబాబు తిరస్కరించారని, కానీ 2019లో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 54 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించారని గుర్తుచేశారు పేర్ని నాని.. అయితే, చంద్రబాబు హయాంలో ఆర్టీసీ అప్పులు భారీగా పెరిగాయని, జగన్ ప్రభుత్వంలో వాటిని గణనీయంగా తగ్గించామని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ హయాంలో ఉద్యోగుల జీతాలకు ప్రతి సంవత్సరం రూ.3,600 కోట్లు చెల్లించారని, మొత్తం అప్పులను రూ.9 వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్లకు తగ్గించారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై కూడా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, చంద్రబాబు గతంలో ఒక్క ఎలక్ట్రిక్ బస్సు కూడా కొనలేదని విమర్శించారు. జగన్ హయాంలో 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి తిరుపతిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
ప్రస్తుతం పీఎంఈబస్ స్కీమ్ పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు నాని.. ఆర్టీసీలోని 10 వేల బస్సులను ప్రైవేటీకరిస్తే పేదలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తున్నామని చెప్పుకుంటూ, ఆ పథకానికి సంబంధించిన నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. మహిళల ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిపైనే నిందలు వేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలోని సంపద మొత్తం కొద్దిమందికే పరిమితమవుతోందని, ఆర్టీసీ నియామకాలను కూడా నిలిపివేశారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!