Minister kollu Ravindra: జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్.. ఎక్కడ రైతులు కనిపించలేదు..
- జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు..
- వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్..
- జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదు..
- పక్క గ్రామాల నుండి రైతులను తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister kollu Ravindra: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనపై సెటైర్లు వేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్న ఆయన.. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుండి రైతులను తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని దుయ్యబట్టారు.. పొలం గట్ల మీద నడిచి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చాడు.. తుఫాన్ తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేశారని మండిపడ్డారు.. జగన్ పర్యటన అద్యంతం పచ్చి అబద్దాలతో సాగింది.. జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదు.. కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించాడు.. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచి లేదని పేర్కొన్నారు.
Read Also: Harmanpreet Kaur Wax Statue: టీమిండియా కెప్టెన్ కు అరుదైన గౌరవం.. ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం..!
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
ఇక, పంట కాలువలను బాగు చేయడం వల్లే పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు ఎప్పటికప్పుడు కాలువల గుండా వెళ్లిపోయింది.. ఫలితంగా రైతులు చాలా వరకు నష్టపోకుండా చూడగలిగాం అన్నారు కొల్లు రవీంద్ర.. వైసీపీ ఐదేళ్ల పాలనలో కాలువల్లో చారడు మట్టి కూడా తీయలేదన్న ఆయన.. చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేసే అర్హత జగన్ కు లేదన్నారు.. తల్లిని చెల్లిని పట్టించుకోని వ్యక్తి జగన్.. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. RTGS నుండి తుఫాన్ సహాయ చర్యలపై చంద్రబాబు, లోకేష్ నిరంతరం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.. తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజే ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని సీఎం చూశారు.. ఆ మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన చేసి పంట నష్టం అంచనాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు తయారు చేశాం.. పంట నష్టం నమోదుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.. ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం విశేషంగా కృషి చేసింది.. తుఫాన్ సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతాహితంగా పని చేశారు.. కానీ, పని చేసే అధికారులను అవమానపరిచే విధంగా జగన్ మాట్లాడిన తీరు గర్హనీయం అని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!