Bird Flu In AP: నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్న కోళ్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న పౌల్ట్రీ నిర్వాహకులు..
- ఏపీలో విస్తరిస్తున్న బర్డ్ ప్లూ.. ఉభయ గోదావరి జిల్లాలో వైరస్ టెర్రర్..
- కృష్ణాజిల్లాకు పాకిన వైరస్.. గంపలగూడెంలోని పౌల్ట్రీలో 10 వేల కోళ్లు మృతి..
- వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ షాపులను మూయించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలంలోని అనుమ్మోలంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. గడిచిన రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 10 వేలకు పగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర చనిపోయిన కోళ్ళను గంపలగూడెం వెటర్నరీ వైద్యుడు జి. సాయి కృష్ణ పరిశీలించారు. వైరస్ తో చనిపోయిన ప్రాంతాల్లోని సుమారు 10 కిలో మీటర్ల పరిధిలో చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను తినొద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మృతి చెందిన కోళ్లను టెస్టుల కొరకు ల్యాబ్ కు పంపనున్నారు అధికారులు. 18 లక్షల ఖర్చుతో 15 వేల కోడి పిల్లలను పౌల్ట్రీలో పెంచుతున్నామని పౌల్ట్రీ ఫారం నిర్వాహకుడు అత్తునూరి కాంత రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 10 వేల కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోతున్నాయి.. లక్షల్లో నష్టం వాటిల్లింది.. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.
Read Also: Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్లో భారీ మోసం.. రూ. 562 కోట్ల విలువైన నకిలీ బిల్లులు
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
మరోవైపు, ఉభయ గోదావరి జిల్లాలను బర్డ్ ప్లూ వణికిస్తుంది. తుర్పు గోదావరి జిల్లా మిర్తిపాడులో బర్డ్ ప్లూతో 8 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో 2 కిలో మీటర్ల పరిధి వరకు బఫర్ జోన్ గా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వైరస్ సోకిన పౌల్ట్రీ ఫారాలు కిలో మీటర్ పరిధిలో ఆంక్షలు విధించారు. బర్డ్ ప్లూ సోకిన కోళ్లు నిర్మూలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమైయ్యాయి. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
తాజావార్తలు
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!