భువనగిరి (మ) వడపర్తి ఎంపీ దత్తత గ్రామంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కలెక్టర్ పమేలా సత్పతి. అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్, కేసీఆర్పై తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ముఖ్యమంత్రి అని.. ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని హామీ ఇచ్చారు ఒకసారి వడపర్తి వచ్చి చూడు ఇక్కడ బోర్ నీళ్లే ఉన్నాయని ఫైర్ అయ్యారు.
Read Also: తమిళనాడు ఆటోడ్రైవర్ను అభినందించిన మంత్రి కేటీఆర్
వడపర్తి గ్రామానికి ఒక నీటి కనెక్షన్ ఇవ్వలేదని.. ఈ యాబై వేల కోట్లు ఎవ్వరూ ఏసుకోని పోయారని ఆయన ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు అవుతున్నా మాధవరెడ్డి స్వంత గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టలేదని మండిపడ్డారు. కొండ పోచమ్మ చూసి మురిసిపోవలా…గందమల్ల రిజర్వాయర్ లేదుగా…? అంటూ ప్రశ్నించారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం అందించిన వాడే నిజమైన పాలకుడని పేర్కొన్నారు. తొమ్మిది ఏళ్ల తర్వాత ఇప్పుడు విద్యావ్యవస్థ మీద ఆలోచన వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమని.. ఫీజ్ రీఎయింబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీని గాలికి వదిలేశాడని కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.