Kodali Nani: ఇతర రాష్ట్రాలలో రోడ్లపై గోతుల్లేవా? లేవని నిరూపించగలవా పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani Fires on TDP And Janasena: వరదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గోదావరి వరద ప్రాంతంలో సీఎం జగన్ పునరావాసం ఏర్పాటు చేశారని కొడాలి నాని వెల్లడించారు. బాధితులకు ఆహారం, నీరు అందించడం సహా కుటుంబానికి రూ.2 వేలు ఇచ్చారన్నారు. వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఒక్కో కలెక్టర్కు రూ. 6-8 కోట్లు కేటాయించి సహాయ కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు కూడా ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఇలాగే ఆరోపణలు చేశారని.. స్వయంగా సీఎం వెళ్లి సమస్యలు పరిష్కరించారని గుర్తుచేశారు. గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని పేర్కొన్నారు. త్వరలో సీఎం జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. గ్రామాల్లో తిరిగి సమస్యలు, లోటు పాట్లు తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరిస్తారని కొడాలి నాని అన్నారు.
Read Also: Godavari Sea Water Colours: నీరంగు నీదే.. నా రంగు నాదే
Also Read
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
కాగా రోడ్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు కూడా కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. భారత దేశంలో 10-20 శాతం రోడ్ల గోతులు సహజంగానే ఉంటాయని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా రోడ్లు పోయేవి పోతుంటాయి, వేసేవి వేస్తుంటారని కొడాలి నాని చెప్పారు. రోడ్లపై పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం చేపట్టారని.. పవన్ కళ్యాణ్ను తాను అడుగుతున్నానని.. ఏ రాష్ట్రానికైనా వెళదాం.. 10 శాతం రోడ్లు కచ్చితంగా దెబ్బతిని ఉంటాయి.. చూపిస్తానని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్లపై గోతులు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎంను కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరతానన్నారు. నిరూపించలేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని కొడాలి నాని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలోనూఏ జర్నలిస్ట్ కాలనీ సహా పలు చోట్ల రోడ్లపై గోతులు పడ్డాయన్నారు. హైదరాబాద్ – విజయవాడ హైవేపైనా గోతులు దర్శనమిస్తాయన్నారు. రాష్ట్రంలో రోడ్ల పై విమర్శించే వారికి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల దుస్థితి కనిపించదా అని నిలదీశారు. శాసన సభకు రానని శపథం చేసిన చంద్రబాబు ఈరోజు శాసన సభకు వచ్చారని.. చంద్రబాబుకు తన భార్య విషయంలో చేసిన శపథం కంటే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ఎక్కువైందా అని ప్రశ్నించారు. చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారని.. ఆయన మాటను ఎవరూ నమ్మరన్నారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..