KCR Focus on Andhra Pradesh: ఏపీపై కేసీఆర్ ఫోకస్.. బీఆర్ఎస్ తర్వాత టార్గెట్ అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తర్వాత ఏపీనే నెక్ట్స్ టార్గెట్గా బీఆర్ఎస్ ఎంచుకుంది. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరయ్యేందుకు సంక్రాంతిని ముహూర్తంగా కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్.
Read Also: BRS Kisan Cell: బీఆర్ఎస్ కిసాన్ సెల్అధ్యక్షుడిగా కీలక నేత..
Also Read
అమరావతిలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. 2019లో వైసీపీ గెలుపునకు టీఆర్ఎస్ అన్ని విధాలా సహకరించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఏపీ నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో.. ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ మూలాలు ఉన్న నేతలను ఆకర్షించేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. ఏపీ టీడీపీ నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండవల్లికి మంచి పేరుంది. తన వ్యూహంలో భాగంగా ఉండవల్లికి కేసీఆర్ ఆహ్వానం పంపారు. ఏపీకి చెందిన కొందరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ఏపీ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి తలసాని చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగింది.. అలాగే మరికొంతమందిపై కూడా దృష్టిసారించారు గులాబీపార్టీ బాస్.
- Tags
- Andhra Pradesh
- BRS
- BRS Party
- cm kcr
- kcr
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!