KCR Focus on Andhra Pradesh: ఏపీపై కేసీఆర్ ఫోకస్.. బీఆర్ఎస్ తర్వాత టార్గెట్ అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తర్వాత ఏపీనే నెక్ట్స్ టార్గెట్గా బీఆర్ఎస్ ఎంచుకుంది. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరయ్యేందుకు సంక్రాంతిని ముహూర్తంగా కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్.
Read Also: BRS Kisan Cell: బీఆర్ఎస్ కిసాన్ సెల్అధ్యక్షుడిగా కీలక నేత..
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
అమరావతిలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. 2019లో వైసీపీ గెలుపునకు టీఆర్ఎస్ అన్ని విధాలా సహకరించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఏపీ నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో.. ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ మూలాలు ఉన్న నేతలను ఆకర్షించేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. ఏపీ టీడీపీ నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండవల్లికి మంచి పేరుంది. తన వ్యూహంలో భాగంగా ఉండవల్లికి కేసీఆర్ ఆహ్వానం పంపారు. ఏపీకి చెందిన కొందరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ఏపీ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి తలసాని చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగింది.. అలాగే మరికొంతమందిపై కూడా దృష్టిసారించారు గులాబీపార్టీ బాస్.
- Tags
- Andhra Pradesh
- BRS
- BRS Party
- cm kcr
- kcr
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!