Karumuri Nageswara Rao: చంద్రబాబు మాయమాటలు చెప్పే వ్యక్తి.. టీడీపీ మేనిఫెస్టో ఓ టిష్యూ పేపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు చెప్పే వ్యక్తి అని.. ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓ ముసలి నక్క అని ధ్వజమెత్తిన ఆయన.. ఇటీవలే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఓ టిష్యూ పేపర్ లాంటిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంతంగా ఏనాడు అధికారంలోకి రాలేదని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని ఆరోపించారు. అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వమే ముందుందని.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
Gujarat : పోర్న్ సైట్లు, న్యూడ్ ఫోటోలు.. ఇలాంటి పార్టనర్ వద్దని పోలీసుల చెంతకు చేరిన భార్య
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాగులు, జొన్నలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి కారుమూరి వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో కూడా గోధుమ పిండి కొనుగోలు మొదలు పెట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రమే గత ప్రభుత్వం ఐదేళ్లలో రెడ్ కందిపప్పు (దాల్)కు రూ.487 కోట్లు ఖర్చు చేస్తే.. తమ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లకు 2 లక్షల 99 మెట్రిక్ టన్నులకు గాను ఒక వెయ్యి 73 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రబీ సీజన్లో రైతులకు 2763 కోట్లకు గాను 19.55 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా చెల్లించాల్సింది రూ.800కొట్లేనని, అది కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. కేరళ రాష్ట్రం తమకు రైస్ కావాలని అడుగుతోందని, ఎంత రైస్ అయిన కొనడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తోందని చెప్పుకొచ్చారు.
Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
కాగా.. అంతకుముందు కూడా టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అలవికాని హామీలతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, టిష్యూ పేపర్ కన్నా హీనమైన ఆ మేనిఫెస్టోలోని హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని, ఎవరెన్ని అమలు చేశారో చూద్దామని సవాల్ విసిరారు. బాబుకు పదవీ కాంక్ష, రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన వదలడం లేదని.. చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేతకళ కనిపిస్తుందని ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..