YS Jagan: ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
- ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం- వైఎస్ జగన్
- విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది- జగన్
- వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది
- ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదు
- చంద్రబాబు మానవతా విలువలు ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించేవారు- వైఎస్ జగన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించే వారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది.. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది.. వాతావరణ శాఖ అలర్ట్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.
Read Also: Arekapudi Gandhi: ఆంధ్రోళ్ల పవర్.. తెలంగాణ పవర్ అంటూ మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి?
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీన వచ్చిన 9950 క్యూసెక్కులు కిందికి ఎందుకు వదల లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నా.. పై నుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు.. ఇది మెన్ మెడ్ ఫ్లడ్ అని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వం.. ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో గ్లోబెల్స్కి తమ్ముడు అవుతాడని విమర్శించారు. అబద్ధాలు తయారు చేయగలడు, వాటిని అమ్మగలడని ఆరోపించారు. మీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా.. ఇంకా జగన్ నామం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏమి అయినా జగన్ కారణం అంటున్నారు.. సచివాలయాలను, వాలంటరీ వ్యవస్థలను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.
Read Also: Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
ఈ క్రాప్ ఏమి అయింది.. తమ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చి ఉండి ఉంటే ఎకరానికి 40 నుంచి 45 వేలు రైతులుకి వచ్చేవని జగన్ చెప్పారు. జగన్ మీద అరవకుండా ఆలోచించాలి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. తప్పు ఒప్పుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. చంద్రన్న వస్తాడు.. 20 వేలు ఇస్తాడు అని రైతులకు చెప్పాడు.. పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు బాగా నటిస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి పెద్దగా తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!