YS Jagan: ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
- ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం- వైఎస్ జగన్
- విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది- జగన్
- వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది
- ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదు
- చంద్రబాబు మానవతా విలువలు ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించేవారు- వైఎస్ జగన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించే వారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది.. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది.. వాతావరణ శాఖ అలర్ట్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.
Read Also: Arekapudi Gandhi: ఆంధ్రోళ్ల పవర్.. తెలంగాణ పవర్ అంటూ మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి?
Also Read
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీన వచ్చిన 9950 క్యూసెక్కులు కిందికి ఎందుకు వదల లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నా.. పై నుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు.. ఇది మెన్ మెడ్ ఫ్లడ్ అని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వం.. ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో గ్లోబెల్స్కి తమ్ముడు అవుతాడని విమర్శించారు. అబద్ధాలు తయారు చేయగలడు, వాటిని అమ్మగలడని ఆరోపించారు. మీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా.. ఇంకా జగన్ నామం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏమి అయినా జగన్ కారణం అంటున్నారు.. సచివాలయాలను, వాలంటరీ వ్యవస్థలను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.
Read Also: Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
ఈ క్రాప్ ఏమి అయింది.. తమ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చి ఉండి ఉంటే ఎకరానికి 40 నుంచి 45 వేలు రైతులుకి వచ్చేవని జగన్ చెప్పారు. జగన్ మీద అరవకుండా ఆలోచించాలి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. తప్పు ఒప్పుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. చంద్రన్న వస్తాడు.. 20 వేలు ఇస్తాడు అని రైతులకు చెప్పాడు.. పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు బాగా నటిస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి పెద్దగా తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!