Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothula Nehru: జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తాను ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు రాజకీయ ఉద్దేశాలతో వెళ్లలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని, దానిపై వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అయితే, ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న రాజకీయ ట్రాప్లో తమ పార్టీకి చెందిన కొందరు నేతలు పడుతున్నారని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులను పార్టీ నేతలు గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం సరైన వ్యాఖ్య కాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలకు ఒక్క అంశాన్ని మాత్రమే కారణంగా చెప్పడం సమంజసం కాదన్నారు జ్యోతుల నెహ్రూ.. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. మెజారిటీ కాపులు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ముద్రగడ పద్మనాభం తనకు బంధువని, అలాగే తన నియోజకవర్గానికి చెందిన నాయకుడని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఆ వ్యక్తిగత అనుబంధం కారణంగానే సంస్మరణ సభకు వెళ్లానని, అక్కడ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇక, కాపు సామాజిక వర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తమ స్థాయిలో చేయాల్సిన ప్రతి పని చేస్తామని, కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.
తాజావార్తలు
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!