Jyothula Nehru: అభివృద్ధి, సంక్షేమాల వారధి రాష్ట్ర బడ్జెట్
- అభివృద్ధి.. సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్..
- కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ తో అందరికీ న్యాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothula Nehru: అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా ఉందని.. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని, వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతాయుతంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్లో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకునే కొత్త ఫీచర్..
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారికోసం బడ్జెట్ లో విద్యా, వైద్యానికి పెద్దపీట వేశామని తెలిపారు జ్యోతుల నెహ్రూ.. 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో బీసీలకు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.. గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయించిందని.. అలాగే రోడ్ల్ అభివృద్ధికి 9554 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చే విధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన కూటమి ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం 4280 కోట్ల, ఎస్సీ ల సంక్షేమం కోసం 18497 కోట్ల రూపాయలు, ఎస్టీ అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు, ఎస్టీల అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్లు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై ప్రశ్నించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేకే అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ…
తాజావార్తలు
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..