Jyothula Nehru: అభివృద్ధి, సంక్షేమాల వారధి రాష్ట్ర బడ్జెట్
- అభివృద్ధి.. సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్..
- కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ తో అందరికీ న్యాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothula Nehru: అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా ఉందని.. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని, వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతాయుతంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్లో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకునే కొత్త ఫీచర్..
Also Read
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారికోసం బడ్జెట్ లో విద్యా, వైద్యానికి పెద్దపీట వేశామని తెలిపారు జ్యోతుల నెహ్రూ.. 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో బీసీలకు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.. గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయించిందని.. అలాగే రోడ్ల్ అభివృద్ధికి 9554 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చే విధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన కూటమి ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం 4280 కోట్ల, ఎస్సీ ల సంక్షేమం కోసం 18497 కోట్ల రూపాయలు, ఎస్టీ అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు, ఎస్టీల అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్లు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై ప్రశ్నించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేకే అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ…
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!