Minister Nadendla Manohar: పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా.. వర్మ విషయం టీడీపీ అంతర్గతం..!
- జనసేన ఆవిర్భావోత్సవానికి సిద్ధమవుతోన్న పిఠాపురం..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ నేత వర్మపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు..
- పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా..
- వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. ఆయన విషయం టీడీపీ చూసుకుంటుంది..
- వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు..
- వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం మాకు ఏమి ఉంటుందని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: జనసేన ఆవిర్భావోత్సవానికి పిఠాపురం సిద్ధమవుతోన్న వేళ.. ఓవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని పేర్కొన్న ఆయన.. ఇక, వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. వాళ్ల పార్టీ.. ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.. వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం మాకు ఏమి ఉంటుంది? అని ప్రశ్నించారు. ఇక, పవన్ కల్యాణ్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్తో పాటు పార్టీ పరంగా మేం కూడా చూసుకుంటాం.. సభా ప్రాంగణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం అన్నారు..
Read Also: Robinhood : అదిదా సర్ప్రైజ్ ప్రోమో.. మల్లెపూలతో మత్తెక్కిస్తున్న ‘కేతిక కెవ్వు కేక’
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభం అవుతుందన్నారు నాదెండ్ల మనోహర్.. భాష, సంస్కృతిని గౌరవించుకునేలా సభ జరుగుతుంది.. సభ పూర్తయిన తర్వాత పారిశుద్ధ్యం భాద్యత కూడా మేమే తీసుకుంటాం.. భారత దేశంలో ఏ పార్టీ కూడా ఈ విధంగా పర్యావరణం కూడా ఆలోచించి ఉండదన్నారు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. కాగా, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి పిఠాపురం వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది జనసేన పార్టీ.. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారడం.. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కావడం.. కీలక శాఖలను జనసేన దక్కించుకున్న తర్వాత.. జరుగుతోన్న తొలి ఆవార్భావోత్సవం కాబట్టి.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడానికి ప్లాన్ చేస్తోంది జనసేన పార్టీ.. ఈ సభా వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!