Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్కు ఎమ్మెల్యే నానాజీ క్షమాపణలు
- వైద్య విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ..
- రంగనాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్ కు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే నానాజీ..
- ఎమ్మెల్యేని తీసుకువచ్చి క్షమాపణలు చెప్పించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pantham Nanaji: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు చెప్పారు. కేసు నమోదు చేయొద్దని కూడా నేను అడగడం లేదన్నారు. నేను వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపంలో బూతులు వచ్చేశాయని పేర్కొన్నారు. తీరా చూస్తే ఈయన నా స్నేహితుడే.. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నాను అని ఎమ్మెల్యే ప్రకటించారు.
Read Also: Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
కాగా, దాడికి గురైన డాక్టర్ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. కేసు పెడుతున్నామని చెప్పారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని స్టూడెంట్స్ కు సూచించారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. ముందుగా నేరస్థులను గుర్తించాలి అని అన్నారు. నాతో పాటు దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు. ఎమ్మెల్యే మీద నాకు కోపం లేదు.. కానీ పది మంది మధ్య చేసిన పని బాలేదని వైస్ చైర్మన్ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..
అయితే, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డాక్టర్లు ఆందోళనకి సిద్ధమవుతున్నారు. జీజీహెచ్ దగ్గర నిరసన తెలుపనున్నారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీని కలిసి ఈ సంఘటనపై వైద్యులు ఫిర్యాదు చేయనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడే విషయంలో డాక్టర్ ను బూతులు తిట్టి, మాస్క్ లాగేసిన ఎమ్మెల్యే నానాజీ.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ జోక్యంతో డాక్టర్ కి పంతం నానాజీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!