పోలీస్ శాఖలో ఏపీ ప్రభుత్వం కీలక బదిలీలను చేపట్టింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ను తప్పించిన ప్రభుత్వం… తాజాగా కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్గా బదిలీ అయ్యారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్గా ఉన్న ప్రకాష్ను కడప జైలర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే.
గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను అనంతపురం జైల్లోనే హత్యకు గురైనప్పుడు వరుణారెడ్డి జైలర్గా ఉన్నారని, ఇప్పుడదే వరుణా రెడ్డి కడప జైలర్గా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. కడప జైల్లో ప్రస్తుతం వివేకా హత్య కేసు నిందితులు ఉన్నందున వారిని హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వరుణా రెడ్డి కడప జైలర్ గా ఉండడంపై తమకు అనుమానంగా ఉందని, దీనిపై తాము సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వరుణా రెడ్డిని కడప జైలు నుంచి ఒంగోలు సెంట్రల్ జైలుకు ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.
