Cybercrime : మత్యశాఖ జేడీకి సీబీఐ కాల్.. 7.6 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఆంధ్ర రాష్ట్ర మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ కి గురైయ్యారు. ఈ క్రైమ్ లో ఆయన లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గత నెల 27 వ తేదీన వి.వెంకటేశ్వరరావు పెనమలూరు కూడలి లోని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్తున్న తరుణంలో ఆయనకి ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) పేరుతో ఓ ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా.. అవతలి వాళ్ళు చెప్పిన విషయం విని విస్తుత పోయారు. కొంత కాలం క్రితం ముంబయిలో మీ ఆధార్ నంబరుతో వి.వెంకటేశ్వరరావు పేరు పైన ఓ సిమ్ కార్డు కొన్నారని.. అలానే ఆ సిం కార్డు నుండి ఓ మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు వెళుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది విన్న వి.వెంకటేశ్వరరావు నిర్ఘాంత పోయారు.
Read also:Telangana Elections 2023: ప్రచారంలో కౌశిక్రెడ్డి ఎమోషనల్ బ్లాక్మెయిల్.. విచారణకు ఈసీ ఆదేశం!
Also Read
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
అతనికి ఆలోచించుకునే సమయం కూడా వాళ్ళు ఇవ్వ లేదు. వెంటనే ఫోన్ మాట్లాడుతున్న ఆ వ్యక్తి వెంకటేశ్వరరావు తో నౌపడా పోలీస్ స్టేషన్ ఎస్సైతో మాట్లాడాలంటూ కాన్ఫరెన్స్ కలిపాడు. కాన్ఫరెన్స్ లో మరో వ్యక్తి తన పేరు సందీప్రావు అని, తాను నౌపడా స్టేషన్ ఎస్సైని అంటూ.. మీ మీద దాదాపు 17 మంది మహిళలు ఫిర్యాదు చేసారని చెప్పాడు. దీనితో వెంకటేశ్వరరావు మరింత భయపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధంకాని వెంకటేశ్వరరావు తాను ఏపీ మత్స శాఖలో జాయింట్ డైరెక్టర్నని తెలిపి.. నా 60 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు ముంబయి వచ్చిందే లేదని.. అలాంటప్పుడు నేను ఎలా సిమ్ కార్డు కొని మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు ఎలా చేయగలను అని ప్రశించారు. అయితే ఎస్సై సందీప్రావు అంటూ మాట్లాడిన ఆ వ్యక్తి వెంకటేశ్వరరావు మాటలను పట్టించుకోలేదు. అంతేకాదు ఒకసారి సీబీఐ అధికారి మీతో మాట్లాడతారంటూ మరో వ్యక్తిని రంగంలోకి దించాడు. అతను తన పేరు ఆకాష్ కులహరి అని.. తాను సీబీఐ అధికారినంటూ ఫోన్లో స్కైప్ యాప్ ద్వారా పోలీస్ యూనిఫాంతో వీడియో కాల్ లో మాట్లాడాడు.
Read also:Tollywood: ఇస్మార్ట్ శంకర్-మాస్ కా దాస్ మధ్య బాక్సాఫీస్ ఫైట్…
ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు హడలిపోయారు. కాగా సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ కేసు విషయంలో కొంత నగదు డిపాజిట్ చేయాలని, కేసు పూర్తయిన తర్వాత తిరిగి తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా వాళ్ళు చెప్పిన ఖాతాలో రూ.7.60 లక్షలు డిపాజిట్ చేయాలని, నేషనల్ సీక్రెట్ లా మేరకు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చేయెప్పకూడదని.. చివరికి కుటుంబసభ్యులకు కూడా చెప్పకూడదని హెచ్చరించారు. అప్పటికే బెంబేలిత్తి పోతున్న వెంకటేశ్వరరావు సరేనని తన దగ్గర ఉన్న డబ్బులతో పాటుగా మరి కొంత అప్పు చేసి వాళ్ళు చెప్పిన ఖాతాలో వేశారు. డబ్బులు ఖాతాలో వేసినప్పటి నుండి తనకు కాల్ చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ కాల్ చెయ్యలేదు. ఆయన కాల్ చేసిన ఎవరు అందుబాటులో కి రాలేదు. ఈ క్రమంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వెంకటేశ్వరరావు.. సోమవారం జిల్లా ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో కేసు నమోదు చేయాల్సిందిగా జాషువా పెనమలూరు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!