Potina Mahesh: చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగిందో అంబటి చూశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Potina Mahesh: వైసీపీ నేతలపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం జరిగిందో అంబటి చూశాడా అని ప్రశ్నించారు. లోపలకు వెళ్లి సోఫాల కింద దూరి విన్నావా అంబటి అని నిలదీశారు. బాబు-పవన్ కలిస్తే వైసీపీ నేతలకు ఎందుకు భయం అని సూటి ప్రశ్న వేశారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, కారుమూరు నాగేశ్వరరావు జగన్ చెప్పు చేతల్లో పని చేసే మంత్రులు అని పోతిన మహేష్ విమర్శలు చేశారు. వాళ్ల వాళ్ల శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు కనీసం అవగాహన లేదని చురకలు అంటించారు. వెల్లంపల్లికి మతి సరిగా ఉందో లేదో ఆస్పత్రిలో చూపించుకోవాలన్నారు. మసాజ్ కల్చర్ వెల్లంపల్లిది కాబట్టి.. ఆయనకు అవే గుర్తుకు వస్తాయన్నారు. వెలంపల్లి నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆయన అమ్మాయిలతో చేయించుకునే మసాజ్ వివరాలు బయటపెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు.
Read Also: Viral Video: ప్రధాని మోదీ వస్తున్నారని.. ఎండిపోయిన గడ్డికి గ్రీన్ కలర్
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
జీవో నెంబర్ 1తో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. జీవో నంబర్ 1 అంశంపైనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారన్నారు. వైసీపీ వరాహాలు గుంపులుగా వచ్చి పవన్ కళ్యాణ్పై విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. తాము వారాహి అని పేరు పెడితే.. వైసీపీ వరాహాలు ఏదేదో వాగాయని.. ఇక వారాహి రోడ్ మీదకు వస్తే.. ప్యాంట్లు తడుపుకుంటారని చురకలు అంటించారు. భయంతో నోరు పారేసుకుంటోన్న వైసీపీ నేతలకు ఆంజనేయుని తాయిత్తులు పంపుతామన్నారు. కేసీఆర్ దత్త పుత్రుడు జగన్ అని.. అందుకే ఇక్కడ నాశనం చేసి.. అక్కడ అభివృద్ధికి సహకరించారన్నారు. వైసీపీ చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ఏపీని సర్వనాశనం చేసేందుకే వైసీపీ పుట్టిందన్నారు. పండుగ చేసుకునేందుకు కనీసం డబ్బులు లేక పేదలు నరకం చూస్తున్నారన్నారు. జగన్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యలే శరణ్యం అనేలా చేశారని.. ప్రజలు బయటకి వచ్చి తమ ఆవేదన చెప్పినా పట్టించుకోవడం లేదని పోతిన మహేష్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!