కోవిడ్ చికిత్స విధానాలపై ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలి: జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ పరిస్థితులను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపిన అధికారులు. 1.06 లక్షలకు పైగా కేసుల్లో 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని తెలిపిన అధికారులు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని వెల్లడించారు. 18 ఏళ్ల పైబడ్డ వారికి 90.34 శాతం మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేయాలని తెలిపారు.
15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న వారికి 98.91శాతం మొదటి డోస్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కోవిడ్ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలన్నారు. విప్లవాత్మకమైన చర్యగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు.
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
Read Also: ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలి: వెంకట్రామిరెడ్డి
జీఎంపీ ప్రమాణాలున్న మందులనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామన్నారు. ఇంతకు ముందు ఎవ్వరూ ఇలా చేయలేదన్నారు. నాడు–నేడు కింద గతంలో ఎప్పుడూ లేని విధంగా డబ్బు ఖర్చు చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు కాలక్రమేణా దేశానికి తప్పనిసరిగా ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. కనీసం 8–10 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండి ఆరోగ్యశ్రీ అమలుపై ఆరా తీయాలని ఆరోగ్యశ్రీ సీఈఓను సీఎం జగన్ ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలనల ద్వారా ఆరోగ్యశ్రీ మరింత బలోపేతంగా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.
తాజావార్తలు
-
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
-
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
-
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!